ఆర్టీవో అధికారుల విస్తృత తనిఖీలు
పలు వాహనాలకు భారీ జరిమానా.
బాలానగర్ /నేటి ధాత్రి
మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలో నారాయణపేట, మహబూబ్ నగర్ సంయుక్తంగా విస్తృతంగా వాహనాలను తనిఖీ చేపట్టారు. అనుమతి పత్రాలు లేని వాహనాలకు భారీ జరిమానా విధించారు. గురువారం ఉదయం కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు దహనం ఘటన చోటు చేసుకోవడంతో అధికారులు వాహనాల తనిఖీ నిర్వహించారు. అధిక లోడుతో వెళ్తున్న వాహనాదారులను అధికారులు హెచ్చరించారు. రోడ్డు భద్రతా నియమాలు పాటించాలన్నారు.
