ఎమ్మెల్యే మల్లికార్జున స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గం కోహిర్ మండలంలోని బడంపేట గ్రామంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో స్థానిక శాసనసభ్యులు కె.మానిక్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యేకు పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ సిబ్బంది ఎమ్మెల్యేను సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ మాజీ చైర్మన్ రాజ, జహీరాబాద్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రామకృష్ణారెడ్డి, కోహీర్ మండల బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కోవూరి నర్సింలు పాల్గొన్నారు.
