అంబేద్కర్ ఆశయసాధనకు కృషి చేయాలి
* దళిత మిత్ర యువజన సంఘం ఇంచార్జ్ శివగాళ్ల విజయ్ కుమార్
నేటిధాత్రి, చేవెళ్ళ :
అంబేద్కర్ ఆశయసాధనకు కృషి చేయాలి అని దళిత మిత్ర యువజన సంఘం ఇంచార్జ్ శివగాళ్ల విజయ్ కుమార్ అన్నారు. అల్లావాడ గ్రామంలో దళిత మిత్ర యువజన సంఘం ఆధ్వర్యంలో డా. బాబా సాహెబ్ అంబేద్కర్ 135 వ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. దళిత మిత్ర యువజన సంఘం ఇంచార్జ్ శివగాళ్ల విజయ్ కుమార్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళిలు అర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ ఒక్క వర్గానికి పరిమితం కాదని ఆయన ఆశయం దేశంలో ఉన్న అన్నివర్గాల వారికీ సమాన హక్కులు, సమసమాజ స్థాపనే అని పేర్కొన్నారు. దేశంలో అన్నివర్గాల ప్రజలకు ఆయన సేవలు దక్కాయని అన్నారు.
అంబేద్కర్ తెచ్చిన రిజర్వేషన్ విధానంతో దళిత పీడిత ప్రజల జీవితాల్లో జ్యోతులు వెలిగాయని ఉత్గటించారు. అంబేద్కర్ ఆశయసాధనకు ప్రతి ఒక్కరు కృషి చెయ్యాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ బి. సంజీవ, వైస్ ప్రెసిడెంట్ పి. ప్రవీణ్, జనరల్ సెక్రటరీ బి. రవితేజ, జాయింట్ సెక్రటరీ బి. శ్రీశైలం, కోశాధికారి జె. శివ కుమార్, ఎక్స్కూటివ్ మెంబెర్ బి. ప్రవీణ్, ఎక్స్కూటివ్ మెంబెర్ జె. శివ కుమార్
సలహాదరులు జె. శివ కుమార్, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
