పక్క ఇల్లు ఉన్న… ఐనా.. ఇందిరమ్మ ఇల్లు మంజూరు..

పక్క ఇల్లు ఉన్న… ఐనా.. ఇందిరమ్మ ఇల్లు మంజూరు..

#అసలైన లబ్ధిదారులకు అందని ద్రాక్షల ఇందిరమ్మ ఇల్లు.

#ప్రభుత్వ పథకానికి తూట్లు పొడుస్తున్న నాయకులు.
నల్లబెల్లి, నేటి ధాత్రి;

 

 

 

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ కార్యక్రమంలో భాగంగా నాయకుల వ్యవహార శైలితో గ్రామాలలో అర్హులైన లబ్ధిదారులకు ఇండ్ల మంజూరు చేయకుండా. తమకు నచ్చిన వ్యక్తులకు ఇండ్లు మంజూరు చేయించి ఆర్థికంగా బలోపేతం కావడానికి నాయకులు ప్రయత్నిస్తున్నారని అర్హులైన లబ్ధిదారులు వాపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీలో భాగంగా ప్రతి ఇల్లు లేని నిరుపేదకు ఇల్లు నిర్మించేందుకు ఐదు లక్షల రూపాయలను వెచ్చించి ఇల్లు నిర్మాణం చేపట్టే దిశగా ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్టుగా పథకాన్ని దిగ్విజయం చేసేందుకు అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తుంటే గ్రామాలలో ఉన్న చోటామోటా నాయకులు వారి స్వార్ధ ప్రయోజనాల కోసం అర్హులైన లబ్ధిదారులను పక్కనపెట్టి. కమిషన్లు ఇచ్చే వారికే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు పత్రాలు అందజేసి పబ్బం గడుపుతున్నారని పలువురు ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు అవకతలపై సమగ్ర విచారణ చేపట్టి అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసే విధంగా అధికారులు కృషి చేయాలని నిరుపేద కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version