తెలంగాణ ఉద్యమకారుల కు… గుర్తింపు ఎక్కడ..

తెలంగాణ ఉద్యమకారుల కు… గుర్తింపు ఎక్కడ?

#ప్రభుత్వం ఇచ్చిన హామీల సంగతేంటి.

#చలో హైదరాబాదును విజయవంతం చేయాలి.

#ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆకుల సాంబారావు.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

మలిదశ తెలంగాణ ఉద్యమ పోరాటంలో అలుపెరుగని పోరు చేసిన తెలంగాణ ఉద్యమకా రులు గుర్తింపు లేక ఆర్థిక అసమానులతో ఇబ్బంది పడుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఆరు గ్యారెంటీలలో ఉద్యమకారులకు ఇచ్చిన హామీ ఏమైంది అని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆకుల సాంబారావు అన్నారు. గురువారం మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ఆవరణలో మండల అధ్యక్షుడు తంగేళ్ల భాస్కర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో సాంబారావు మాట్లాడుతూ ఈనెల 18న మర్రి కృష్ణారెడ్డి ఫంక్షన్ హాల్ తార్నాక హైదరాబాదులో ఉద్యమకారుల రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుందని కావున ఉద్యమకారులందరూ ఇట్టి సమావేశానికి హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఉద్యమకారుల అండదండలతో గెలుస్తున్న ప్రభుత్వాలు ఉద్యమకారులకు మొండి చేయి చూపించడం తగదన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఝార్ఖండ్ రాష్ట్ర తరహాలో ఉద్యమకారులకు ప్రభుత్వ గుర్తింపు కార్డులు, ఎకరం భూమి,250 చదరపు గజాల ఇంటి స్థలం, ఇందిరమ్మ ఇల్లు, 25వేల రూపాయలు పెన్షన్ సౌకర్యం, బస్సు రైలు ఉచిత ప్రయాణం, ఆరోగ్య భీమా పథకం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమ కారుల ఫోరం జిల్లా కార్యదర్శి బట్టు సాంబయ్య, టఫ్ మండల ఉపాధ్యక్షుడు పల్లికొండ రవి, జేఏసీ మండల చైర్మన్ వేముల రాజు, ఖ్యాతం శ్రీనివాస్, ఎన్నమల్ల నరసయ్య, పులి రమేష్ గౌడ్, మేరగుర్తి సమ్మయ్య, మామిండ్ల పెద్ద ఐలయ్య, చిన్న అయిలయ్య, కొత్తగట్టు ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version