పాల్గొన్న హన్మకొండ జిల్లా ఇన్చార్జి ప్రధాన న్యాయమూర్తి బి.అపర్ణా దేవి గారు:-
హన్మకొండ, నేటిధాత్రి (న్యాయ విభాగం):-
హన్మకొండ జిల్లా కోర్టు ఆవరణలో మంగళవారం రోజున స్వచ్ భారత్ దివాస్ కార్యక్రమం హన్మకొండ జిల్లా న్యాయ సేవాదికార సంస్థ ఆధ్వర్యంలో జరిగింది. దీనికి జిల్లా ఇన్చార్జి ప్రధాన న్యాయమూర్తి అండ్ జిల్లా న్యాయ సేవాదికార సంస్థ చైర్మన్ బి.అపర్ణా దేవి గారు, మరియు జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి జె.ఉపేందర్ రావు మరియు ఇతర న్యాయమూర్తులు పాల్గొన్నారు, ఈ సందర్భంగా ప్రజలందరు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు.ఇట్టి కార్యక్రమం లో హన్మ కొండ జిల్లా బార్ అసోసియేషన్ ప్రతినిధులు, మరియు న్యాయవాదులు,కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.