కష్టకాలంలో బంధుమిత్రుల తోడ్పాటు.

నర్సంపేట,నేటిధాత్రి:

కష్టకాలంలో ఉన్న ఆ కుటుంబాన్ని బంధుమిత్రులు ఆర్థిక సాయం చేసి ఆదుకున్నారు. నర్సంపేట మండలంలోని చంద్రయ్యపల్లి గ్రామంలో కటిక నిరుపేద కుటుంబానికి చెందిన వీరమల్ల వీరయ్య ఇటీవల అనారోగ్యానికి గురై మృతిచెందాడు. గురువారం మృతుని దశదినకర్మ కార్యక్రమం సందర్భంగా ఆ కుటుంబానికి భరోసా కల్పిస్తూ రూ. 18500 ఆర్థిక సహాయాన్ని బంధుమిత్రులు మృతుని కుటుంబానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో మామిడి రమేష్, కొండా రమేష్,బొమ్మేర మునేష్,వీరమల్ల రాజశేఖర్,రజినీకాంత్,చంద్రశేఖర్ మామిడి రవి చల్ల కిరణ్ బొమ్మెర రాజు,బొమ్మేర యాలాద్రి,వీరమల్ల దేవేందర్,వీరమల్ల మహేందర్ మున్నారు కాపు కుల సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!