superintendent saibabanu suspend cheyali, సూపరింటెండెంట్‌ ‘సాయిబాబా’ను సస్పెండ్‌ చేయాలి

సూపరింటెండెంట్‌ ‘సాయిబాబా’ను సస్పెండ్‌ చేయాలి

వరంగల్‌ అర్బన్‌ జిల్లా ఇంటర్మీడియట్‌ కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న సాయిబాబా పేపర్‌ వాల్యూయేషన్‌ క్యాంపు పేరిట అవినీతికి పాల్పడినాడని, క్యాంపులో జరిగిన అవినీతిపై తక్షణమే విచారణ కమిటీని నియమించి ప్రభుత్వ సొమ్మును కాజేసిన అవినీతి ఉద్యోగులను గుర్తించి వెంటనే వారిని సస్పెండ్‌ చేసి క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని దళిత బహుజన విధ్యార్థి మోర్చా రాష్ట్ర కన్వీనర్‌ గురుమిళ్ల రాజు డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భాయ్స్‌ పేరిట, స్టేషనరీ, ట్రావెలింగ్‌, టిఏ, డిఏ, లెక్చరర్‌లకు పేపర్‌ వాల్యుయేషన్‌ చేసినందుకు ఉన్న లెక్చరర్‌ల కంటే ఎక్కువ మంది లెక్చరర్‌లు వాల్యుయేషన్‌ చేసినట్టుగా పేర్లను సృష్టించి సంతకాలు లేకుండానే బిల్లులు చెక్కుల ద్వారా డ్రా చేశారని, దీనికి డిఐఈవో కూడా సహకరించడం వల్లనే ఇది సాధ్యమయ్యిందని రాజు తెలిపారు. తక్షణమే క్యాంపు కార్యాలయంలో జరిగిన అవినీతిపై విచారణ కమిటీని వేసి అవినీతికి పాల్పడిన ఉద్యోగులను సస్పెండ్‌ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

కమీషనర్‌ను కలవనున్న విద్యార్థి సంఘం నేతలు

అవినీతికి పాల్పడిన ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని, ప్రధాన సూత్రదారి అయిన సూపరింటెండెంట్‌ ‘సాయిబాబా’ను, అతనికి సహకరించిన డిఐఈవో లింగయ్యను సస్పెండ్‌ చేయాలని కోరుతూ తమ వద్ద ఉన్న ఆదారాలతో ఇంటర్మీడియట్‌ బోర్డు కమీషనర్‌ను కలువనున్నట్లు గురుమిళ్ల రాజు తెలిపారు. కార్యాలయంలో జరిగిన అవినీతిపై వెంటనే విచారణ కమిటీని నియమించాలని అన్ని విధ్యార్థి సంఘాలను కలుపుకొని కమీషనర్‌ను కలువనున్నట్లు ఆయన తెలిపారు.

ఆర్జేడీగా అవినీతిపరులను నియమించొద్దు

ఇటీవల గుండెపోటుతో మరణించిన ఇంటర్మీడియట్‌ రీజినల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ హనుమంతారావు మరణించిన విషయం తెలిసిందే. ఆయన మృతికి దళిత బహుజన విధ్యార్థి మోర్చా తరుపున సంతాపం తెలుపుతున్నాము. ఆయన మరణంతో ఖాళీ అయిన ఆర్జేడి బాధ్యతలను ఇంటర్‌బోర్డుకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చే వారిని నియమించాలి. ప్రస్తుతం క్యాంపు కార్యాలయంలో అవినీతిపరులకు సహకరించిన ఓ అధికారి పైరవీలు చేస్తున్నట్లు తెలుస్తున్నదని ఆయనకు ఎట్టి పరిస్థితులల్లో ఇవ్వవద్దని ఇంటర్మీడియట్‌ బోర్డు కమీషనర్‌కు మా తరుపున కోరుతున్నాం. ఆయనపై ఓ మహిళ పలు పోలీస్‌స్టేషన్‌లల్లో ఫిర్యాదు కూడా చేసినట్లు సమాచారంఉందని వాటి వివరాలను త్వరలో కమీషనర్‌కు అందిస్తామని డిబివిఎం రాష్ట్ర కన్వీనర్‌ గురుమిళ్ల రాజు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *