తాసిల్దార్ కు వినతిపత్రం అందజేత…

తాసిల్దార్ కు వినతిపత్రం అందజేత

బిసి, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ నాయకులు

జమ్మికుంట, నేటి ధాత్రి :

 

బీసీలకు 42 శాతంవిద్యా,ఉద్యోగస్థానిక సంస్థల్లో రిజర్వేషన్ బిల్లుల రాజ్యాంగ 9వ షెడ్యూల్లో చేర్పు, కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని మంగళవారం జమ్మికుంట మండల తహసీల్దార్ కు బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాబోయే శీతాకాల పార్లమెంట్ సమావేశాలలో ఈ బిల్లును 9వ షెడ్యూల్లో చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం మండల నాయకులు ఆధ్వర్యంలో జమ్మికుంట తహసీల్దార్ వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు వీరన్న, అనిల్, శ్రీకాంత్, శాంతన్ ధర్మ సమాజ్ పార్టీ మండల నాయకులు, మాడుగుల సందీప్, సురేష్, సాగర్, మనోజ్, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version