JAC Leaders Submit Memorandum to Tahsildar
తాసిల్దార్ కు వినతిపత్రం అందజేత
బిసి, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ నాయకులు
జమ్మికుంట, నేటి ధాత్రి :
బీసీలకు 42 శాతంవిద్యా,ఉద్యోగస్థానిక సంస్థల్లో రిజర్వేషన్ బిల్లుల రాజ్యాంగ 9వ షెడ్యూల్లో చేర్పు, కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని మంగళవారం జమ్మికుంట మండల తహసీల్దార్ కు బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాబోయే శీతాకాల పార్లమెంట్ సమావేశాలలో ఈ బిల్లును 9వ షెడ్యూల్లో చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం మండల నాయకులు ఆధ్వర్యంలో జమ్మికుంట తహసీల్దార్ వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు వీరన్న, అనిల్, శ్రీకాంత్, శాంతన్ ధర్మ సమాజ్ పార్టీ మండల నాయకులు, మాడుగుల సందీప్, సురేష్, సాగర్, మనోజ్, తదితరులు పాల్గొన్నారు.
