డ్రగ్స్ గంజాయి నివారణలో విద్యార్థులు యువత భాగస్వాములు కావాలి
సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి ):
సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా పాఠశాల,కళాశాలలో విద్యార్థులకు మాదకద్రవ్యాల వలన కలుగు అనర్ధాలపై రేపటి నుండి వారం రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు.
నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ఆంటీ నార్కోటిక్స్ బ్యూరో ద్వారా జిల్లా వ్యాప్తంగా పాఠశాల, కళాశాలలో విద్యార్థిని విద్యార్థులకు మాదకద్రవ్యాల వినియోగం వలన కలిగే పరిణామాలపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఐపిఎస్ గారు తెలిపారు..
ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ….
విద్యార్థులు,యువత కు డ్రగ్ అవర్నెస్ వీక్ లో బాగంగా రేపటి నుండి వారం రోజుల పాటుగా ప్రతి పోలీస్ స్టేషన్లలో మత్తు పదార్థాల వలన కలుగు ఆనర్ధాలపై వివిధ కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పించనున్నారు.
1. జిల్లా, మండల కమిటీ సమావేశం(20.06)
2. అంతర్జాతీయ యోగా దినోత్సవం(21.06)
3. డ్రగ్ హాట్ స్పాట్ లలో అవగాహన కార్యక్రమం(22.06)
4. మొక్కలు నాటడం(23.06)
5. స్లోగన్ రైటింగ్ కాంపిటీషన్(24.06)
6. పెయింటింగ్ కాంపిటీషన్(25.06)
7. అంతర్జాతీయ మాదక ద్రవ్య సేవన వ్యతిరేక దినోత్సవం , ర్యాలీ, ప్రతిజ్ఞ, సమావేశం(26.06)
డ్రగ్స్ నిర్ములనకోసం జరుగుతున్న పోరాటంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యమై డ్రగ్స్ మహమ్మరిని నిర్ములించి భావితరాలకు మంచి భవిష్యత్ అందించాలని,యవత , విద్యార్థులు మత్తు పదార్థాలకు,గంజాయికి దూరంగా ఉంటూ భవిష్యత్తులో ఉన్నత స్థానాల్లో ఉండాలన్నారు.