మింగలేని, కక్కలేని మిల్లర్ల కష్టాలెన్నో!

`త్రిశంకు స్వర్గంలో తెలంగాణ మిల్లర్లు!

`నిత్యం ఒత్తళ్లతోనే వ్యాపారం

`దివాలా తీస్తున్నా చెప్పుకోలేని ధైన్యం

`ప్రభుత్వం వినిపించుకోదు!

`అధికారులు పట్టించుకోరు!

`ప్యాడీ టెండర్ల ఆగడాలు తట్డుకోలేకపోతున్నారు

`అన్ని రకాలుగా నష్టాలు మిల్లర్లే అనుభవిస్తున్నారు!

`తేమ శాతంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు!

`నాణ్యమైన బియ్యం అందచేయడానికి మరింత నష్టపోతున్నారు

`బకాయిలు పేరుకుపోతున్నాయి

`కోట్లలో రావాల్సిన సొమ్ము అందక ఆగమౌతున్నారు

`ఎటు చూసినా సమస్యల వలయంలో చిక్కుకుంటున్నారు

`ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని కలిసే అవకాశం లేదు

`కనీసం మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అప్పాయింట్‌మెంటు దొరకదు

`ఉమ్మడి రాష్ట్రంలో ఎలాగూ తెలంగాణ మిల్లర్లకు మేలు జరగలేదు

`పన్నెండేళ్లుగా మిల్లర్ల సమస్యలు వినిపించుకునే నాధుడు లేడు

`అప్పులపాలై అనేక మంది మిల్లర్లు దివాలా తీస్తున్నారు

`ప్యాడీ టెండర్ల మూలంగా ప్రభుత్వం నష్టపోతోంది

`మధ్య వర్తుల మూలంగా మిల్లర్లు అవస్థలు ఎదుర్కొంటున్నారు

`దేశంలో పుడ్‌ సెక్యూరిటీ అమలుకు కారణం మిల్లర్లు

`తెలంగాణ ఉద్యమంలో మిల్లర్ల పాత్ర ఎంతో పెద్దది

`ప్రభుత్వాలు అందించే బియ్యం పథకాల అమలులో మిల్లర్ల సహకారం గొప్పది

`అయినా తెలంగాణ మిల్లర్లపై చిన్న చూపు తగదు

`కొంత మంది దళారుల మూలంగా మిల్లర్ల వ్యవస్థ కుదేలౌతోంది

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

 సమాజంలో కష్టాలు కొందరికే వుంటాయనుకుంటారు. కొన్ని వర్గాలే అనుభివిస్తాంటారు. కాని పీత కష్టాలు పీతవి, సీత కష్టాలు సీతవి అని పెద్దలు ఊరికే అనలేదు. అలాగే సమాజంలో రైస్‌ మిల్లర్లకు కష్టాలుంటాయా? అని కూడా అనుకుంటుంటారు. కాని వారికుండే కష్టాలు వింటే కడుపు చించుకుంటే కాళ్ల మీద పడినట్లే వుంటుంది. పైకి సిల్కు షర్టు వేసుకున్నా లోపల చినిగిన బనియన్‌ వున్నట్లే మిల్లర్లకు కూడ అనేక చిల్లులుంటాయి. కాని పైకి కనిపించే మిల్లర్ల సిల్కు చొక్కలే చూస్తారు. వారి కష్టాలు చెప్పుకోలేక, వినేవారు లేక నానా ఇబ్బందులు పడుతున్నవారు చాలా మంది వున్నారు. సమాజం దృష్టిలో మాత్రం మిల్లర్లుపై రకరకాల అభిప్రాయలుంటాయి. కాని వారి గోడు వినేవారుండరు. చెప్పుకుందామన్నా ఆలకించేవారుండరు. అంత ధైన్యంగా మిల్లర్ల పరిస్ధితులంటాయి. రైతులు మిల్లర్లనే తప్పు పడుతుంటారు. అదికారులు మిల్లర్లపైనే జులుం చేస్తుంటారు. ప్రభుత్వం మిల్లర్లనే దోషులుగా చిత్రీకరిస్తారు. కాని అందరికీ అవసరమైంది మిల్లర్లే అని మర్చిపోతుంటారు. రైతు ఆరు గాలం కష్టం చేసి ధాన్యం పండిస్తాడు. కాని ఆ ధాన్యాన్ని దేశానికి అన్నంపెట్టేలా మార్చేది మిల్లర్లు. ప్రజల నోటికి ముద్ద వచ్చేందుకు మిల్లర్లు కష్టపడుతుంటారు. కాని రైతు కష్టమే చూస్తారు. మిల్లర్‌ను వ్యాపారి కింద జమకట్టేస్తారు. దాంతో మిల్లర్లు తమ గోడును చెప్పలేక, వారి బాధలు మింగలేక, కక్కలేక కష్టాలు పడుతుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే త్రిశంకు స్వర్గంలో జీవిస్తుంటారు. పైన పటారం లోన లొటారం లాగా లాభం లేని వ్యాపారాలు సాగిస్తుంటారు. మిల్లర్లకు లాభాల కన్నా నష్టాలే వుంటాయన్న సంగతి చాలా మందికి తెలియదు. ఎందుకంటే రైతుల ధాన్యం అమ్ముకుంటే రైతుకు రాబడికి మంచి లాభం వస్తుందనుకుంటారు. కాని అది వాస్తవం కాదు. నిత్యం ఒత్తిళ్లతోనే సతమతమౌతుంటారు. కాని పైకి నవ్వుతూ వుంటారు. తాముదివాళా తీస్తున్నామని కూడా చెప్పుకోలేక మధనపడుతుంటారు. ధాన్యం తేమ విషయం నుంచి మొదలు, బియ్యం అమ్ముకునేదాకా కష్టమే. ఎందుకంటే ఒకప్పుడు రైతు ధాన్యాన్ని మిల్లుకు చేర్చినప్పుడు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ వుండేవారు. కాని ఇప్పుడు ఇప్పుడు రైతులు తెచ్చే ధాన్యం మిల్లర్లకు శాపాన్ని తెచ్చిపెడుతుంటి. ఎందుకంటే ధాన్యాన్ని బాగా ఎండబెట్టి, మట్టి లేకుండా చూసుకొని, తాలు లేకుండా తూర్పారపట్టి మిల్లుకు రైతు ధాన్యం తెచ్చేవారు. కాని ఇప్పుడు ఇప్పుడు కోసిన కోతను అలాగే మిల్లుకు చేర్చుతున్నారు. ప్రభుత్వం ఐకేపి వ్యవస్దను తెచ్చిన తర్వాత రైతు ఎలాంటి ధాన్యం తెచ్చినా తీసుకోక తప్పని పరిస్ధితి ఎదురైంది. మిల్లర్ల కష్టాలు ఇక్కడి నుంచే మొదలౌతున్నాయి. రైతుకోత నుంచి నేరుగా తెచ్చే ధాన్యంలో తేమ శాతం ఎక్కువగా వుంటుంది. సహజంగా తేమ 17శాతం వుండాలి. కాని ప్రభుత్వాలు 25 శాతం వరకు వున్నా మిల్లర్లు సేకరించాల్సిందే అంటుంది. దాంతో నాణ్యమైన బియ్యం రావడం కష్టమౌతుంది. ఒకవేళ అలాంటి ధాన్యాన్ని సేకరించకోతే నాయకుల నుంచి, అధికారుల నుంచి పెద్దఎత్తున ఒత్తిళ్లు, బెదిరింపులు ఎదుర్కొవాల్సివుంటుంది. ఇవన్నీ తట్టుకున్నా, మీడియా నుంచి కూడా వచ్చే వార్తల మూలంగా అదో రకమైన ఇబ్బంది. రైతులను ముంచుతున్న మిల్లర్లు అని వార్తలు వస్తాయి. మిల్లర్లు మునుగుతున్నారని ఎవరూ జాలి పడరు. కాని తేమ శాతం ఎంతున్నా ధాన్యం సేకరిస్తే రైతులు ఎలా నష్టపోతాడన్నది ఎవరూ ఆలోలించరు. కాని మిల్లర్లు మోసం చేస్తున్నామంటారు. అసలు ఆ వార్తలకు లాజిక్‌ కూడా వుండదు. లేనిపోని లెక్కలు జోడిస్తారు. మిల్లర్లపై బురజల్లుతారు. కొవ్వొత్తిలాగా మిల్లర్లు తమనుతాము కాల్చుకుంటున్నారని ఎవరూ జాలిపడరు. కాని రైతలును కాల్చుకు తింటున్న మిల్లర్లు అని వార్తలు రాసేస్తుంటారు. రైస్‌ మిల్లర్ల ఆలోచనలు ఎవరూ ఆలకించరు. మిల్లు ఏర్పాటు కోసం అప్పులు తెచ్చి, నిర్మానం చేస్తారు. వాటి ఈఎంఐలు కూడా వెల్లదీసుకోలేక, ఎప్పటి పంట పైసలు అప్పుడు రాక ఎన్ని రకాలుగా మిల్లర్లు ఇబ్బందులు పడుతున్నారో ఎవరికీ అక్కర్లేదు. కాని అందరూ మిల్లర్లనే బెదిరిస్తుంటారు. అయితే మిల్లర్లు వేల కోట్లు బకాయిలు వున్నాయనే వార్తలు కూడా వున్నా యి. ప్రభుత్వం మిల్లర్లకు ధాన్యమిచ్చి, బియ్యం తీసుకోవాలి. కాని మిల్లర్లకు దాన్యం ఇచ్చే క్రమంలో టెండర్‌ ప్యాడీ దళారీ వ్యవస్ధను ఏర్పాటు చేశారు. ఆ దళారీ వ్యవస్దలో వున్నవాళ్లు కూడా కొంత మంది పాతుకుపోయిన మిల్లర్ల అసోసియేషన్‌ పెద్దలున్నారు. అసలు ప్రభుత్వానికి, ఇటు మిల్లర్లకు మద్య దళారీ వ్యవస్ద అవసరమే లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతో యంత్రాంగముంది. సివిల్‌ సప్లైకి శాఖలో వివిద స్ధాయిల్లో ఉద్యోగులున్నారు. వాళ్లు ఎప్పటికప్పుడు మానిటరింగ్‌ చేసుకోవచ్చు. కాని ప్రభుత్వాన్ని నమ్మించి, కొంత మంది అసోసియేషన్‌ పెద్దలు టెండర్ల వ్యవస్ధను తెచ్చిపెట్టారు. ప్రభుత్వాన్ని ఒప్పించారు. ఈ వ్యవస్ధనంతా వారి గుప్పిట్లో పెట్టుకున్నారు. టెండర్‌ వ్యవస్ధ ఎందుకు? ఏర్పాటైందో అసలు కారణం పక్కకు వెళ్లింది. మిల్లర్లను దోచుకునే వ్యవస్దగా ప్యాడీ టెండర్‌ మారిపోయింది. టెండర్‌ వ్యవస్ధ మిల్లర్ల నుంచి ధాన్యమే సేకరించాలి. కాని మిల్లర్ల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. అంటే మిల్లర్లు నష్టపోయినా ఫరవాలేదు. కాని టెండర్‌ వ్యక్తులకు నేరుగా మిల్లర్లు సొమ్ము జమచేయాల్సివస్తుంది. మరి మిల్లర్లు ఆ దాన్యం ఎక్కడమ్ముకోవాలి? ఎలా అమ్ముకోవాలి? నష్టాలు ఎలా భరించాలన్నదానిపై మిల్లర్లు పడుతున్న ఇబ్బందులు ఎవరికీ అక్కర్లేదు. టెండర్‌ దారులకు రూ.1900 చెల్లించాలన్న లెక్క వుంది. కాని టెంటర్‌ దారులు మాత్రం మిల్లర్లు రూ.2300 చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారు. బెదిరిస్తున్నారు. తనికీలు చేయిస్తామని హెచ్చరిస్తుంటారు. ఓ వైపు మిల్లర్లు నెలల తరబడి తమ గోడౌన్లలో దాన్యాన్ని కాపాడేది మిల్లర్లు. ఆ సమయంలో ఎలాంటి నష్టం వాటిల్లిన్నా మిర్లదే బాద్యత. అయినా భరిస్తున్నారు. గోదాములు కిరాయిలు చెల్లించేవారు లేరు. గన్నీ బ్యాగులు పాడైపోతాయి. వాటి ఖర్చు ఎవరు భరించాలి? అని మిల్లర్లు అడిగే ప్రశ్నలకు అధికారులు వద్ద, టెండర్‌ దారుల వద్ద సమాధానం వుండదు. కనీసం కనికరం కూడా వుండదు. దాన్యం మిల్లర్ల గోడౌన్‌ నుంచి లిఫ్ట్‌ చేయరు. కాని డబ్బులు మాత్రం వసూలు చేస్తూ టెండర్‌ దారులు వేదిస్తుంటారు. ఈ విషయంపై మిల్లర్లు కోర్టును కూడా ఆశ్రయించారు. కోర్టు కూడా మిల్లర్లకు అనుకూలంగా తీర్పునిచ్చింది. టెండర్‌ దారులు మిల్లర్ల నుంచి ధాన్యం మాత్రమే తీసుకోవాలి అనిచెప్పింది. కాని ఆ తీర్పును టెండర్‌ దారులు లెక్క చేయరు. అధికారులు అమలు చేయరు. టెండర్‌ ప్యాడీ వ్యవస్ధవల్ల క్వింటాల్‌కు రూ.230 రూపాయలు వారి జేబుల్లోకి వెళ్తుంది. అటు రైతులు బాగుపడ్డట్టు కాదు. ఇటు మిల్లర్లకు మేలు జరిగింది లేదు. ప్రతిసారి టెండర్‌ ప్యాడీ వ్యవస్ధ జేబుల్లోకి రూ.1100 కోట్ల రూపాయలు అప్పనంగా చేరుతోంది. టెండర్‌ ప్యాడీ వ్యవస్ధను తొలగిస్తే ప్రభుత్వానికి రూ.1100 కోట్లు మిగులుతాయి. టెండర్‌ ప్యాడీ పెద్దలకు కనీసం గోడౌన్లు కూడా వుండవు. మిల్లర్లే ఆ ధాన్యాన్ని కాపాడి టెండర్‌ ప్యాడీకి అప్పగిస్తారు. అలాంటప్పుడు టెండర్‌ ప్యాడీ వ్యవస్ధ ఎందుకంటూ, మిల్లర్లు ప్రభుత్వానికి, సంబంధిత అదికారులకు అనేక సార్లు వినతిపత్రాలు కూడా ఇచ్చారు. కాని పట్టించుకున్న నాధుడు లేడు. టెండర్‌ ప్యాడీ పేరుతో ఓ నలుగురు దళారులు బతుకుతుంటే, 3300 మంది మిల్లర్లు అవస్ధలు పడుతున్నారు. సమస్యలు ఎదుర్కొంటున్నారు. అప్పులపాలౌతున్నారు. కాని వారికి అది పట్టడం లేదు. కేవలం దళారుల అవతారం ఎత్తిన నలుగురైదుగురు మేలు కోసం మొత్తం మిల్లర్ల వ్యవస్ధనే ఫణంగా పెట్టడం ఏ మాత్రం సరైంది కాదు. అయితే ఈ దళారుల మూలంగా 3వేల మంది మిల్లర్లు ప్రభుత్వ పెద్దలను కలవలేకపోతున్నారు. వారి సమస్యలు విన్నవించుకోలేకపోతున్నారు. కనీసం మిల్లర్లకు అప్పాయింటు మెంట్‌ కూడా దొరకడం లేదు. మిల్లర్లు ప్రభుత్వ పెద్దలను కలిస్తే తమ బండారం బైట పడుతుందని దళారులు కుట్రలు చేస్తున్నారు. కొసమెరుపు ఏమిటంటే దళారుల అవతారం ఎత్తిన వారిలో మిల్లర్ల యూనియన్‌ అసోసియేషన్‌ నాయకులే వుండడం గమనార్హం. టెండర్‌ ప్యాడీ సభ్యులు రూల్స్‌ ప్రకారం మిల్లర్లు వుండకూడదు. కాని బినామీల పేరుతో మిల్లర్ల అసోసియేషన్‌ పెద్దలు కొంత మంది దళారుల అవతారం ఎత్తి, మిల్లర్లనే దోచుకు తింటున్నారు. ప్రభుత్వానికి చెందిన సొమ్మును మింగుతున్నారు. మిల్లర్ల కడుపు కొట్టి, బతుకుతున్నారు. ప్రభుత్వం ఈ విషయాన్ని తెలుసుకుంటే దళారుల పాలౌతున్న రూ.1100 కోట్లు ఖజానకు చేరుతాయి. లేకుంటే ప్రభుత్వం కనికరిస్తే మిల్లర్లకు అందుతాయి. అటు మిల్లర్లకు కాకుండా, ఇటు ప్రభుత్వానికి కాకుండా దళారులు మింగుతున్నారు. వ్యవస్ధను భ్రష్టు పట్టిస్తున్నారు. మిల్లర్ల ఉసురు పోసుకుంటున్నారు. ప్రభుత్వం ఈ విషయాన్ని గమనించి, మిల్లర్లతో సమావేశం ఏర్పాటు చేస్తే అసలు విషయాలన్నీ బైటకు వస్తాయి. మిల్లర్లు పడుతున్న సమస్యలు వెలుగులోకి వస్తాయి. మిల్లర్లు అను భవిస్తున్న కష్టాలు తెలుస్తాయి. మిల్లర్లకు మేలు జరిగితే రాష్ట్రానికే కాదు, దేశానికి కూడా ఎంతో మంచిది. మిల్లర్లు కేవలం ధాన్యం ఆడిరచి, ప్రభుత్వానికి బియ్యం అందించేందుకు వున్న వ్యవస్ధ. ఈ వ్యవస్ధలో కొంత మంది అవకాశవాదులు చేరి, మిల్లర్ల జీవితాలను ఆగం చేస్తున్నారు. ప్రభుత్వ సొమ్ము అప్పనంగా నొక్కేస్తున్నారు. రైతుల వి షయంలో మిల్లర్లను విలన్లుగా చూపిస్తున్నారు. కాని మిల్లర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ఎవరూ అర ్ధం చేసుకోవడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందిస్తుందని మిల్లర్లు ఆశిస్తున్నారు. వారిని పిలిచి ఒక్కసారి మాట్లాడితే అనేక విషయాలు వెలుగులోకి వస్తాయని కోరుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!