ఘనంగా శ్రీపాదారవు వర్ధంతి వేడుకలు
కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్
భూపాలపల్లి నేటిధాత్రి
మున్సిపల్ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శ్రీపాద రావు 27వ వర్ధంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బట్టు కరుణాకర్ హాజరైనారు అనంతరం చిత్రపటానికి పూలమానవేసి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు బట్టు కరుణాకర్ మాట్లాడుతూ దివంగత మాజీ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి శాసనసభ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాద రావు స్పీకర్ పదవికే వన్నెతెచ్చిన నాయకుడు శ్రీపాద రావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏ ఒక్కరికి ఏ అవసరం పడ్డ ప్రతి సమస్య ను పరిష్కరించిన నాయకుడు. మంథని నియోజక వర్గం ఏజెన్సీ ప్రాంతం అయినప్పటికీ ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో ముందున్న ఏకైక నాయకుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో శత్రువులేని అజాత శత్రువు శ్రీ పాదరావు వారి అడుగుజాడల్లో ఆశయ సాధన కోసం పనిచేస్తామని వారు ఎక్కడ ఉన్నా వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవున్ని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుందని వారు అన్నారు ఈ కార్యక్రమంలో భూపాలపల్లి మున్సిపాలిటీ చైర్మన్ బుర్ర కొమురయ్య వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్ కౌన్సిలర్లు, ఓరుగంటి రాధ, ధరావత్ శారద , పొనగంటి మేఘన శ్రీనివాస్, ఎర్రవెల్లి అరుణ్ రావు, కురుమిళ్ళ శ్రీనివాస్, బడితల వెంకటస్వామి , ఇస్లావత్ రాజు నాయక్ ,బొడ్డు అశోక్ , మాజీ వార్డ్ కౌన్సిలర్ దాట్ల శ్రీనివాస్ వేంపటి భువన సురేందర్ బేతేల్లి మధుకర్ రెడ్డి అజ్మీర తిరుపతి నాయక్, కడారి మాలతి గొగ్గిల లక్మి, నలికా పరమేశ్వరి, ఎద్దు పుష్ప, చల్లా రేణుక, లత, సుష్మ ఎర్రగడ్డల వెంకీ యాదవ్, పోతర్ల ప్రేమ్ కుమార్, అప్పాల శ్రీనివాస్, విజయ భాస్కర్, ఆంజనేయులు, రాజు, దుర్గం తిరుపతి, కిషోర్ శ్రీకాంత్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు
