కన్న తల్లిదండ్రుల కంటే ఎక్కువగా అభిమానించా
బీఆర్ఎస్లో చేరిన శ్రీధర్బాబు వీరాభిమాని దిలీప్
కాంగ్రెస్ పార్టీలో పని చేస్తూ ఎమ్మెల్యే శ్రీధర్బాబును గుండెల్లో దాచుకున్నా గుర్తింపు ఇవ్వలేదని శ్రీధర్బాబు వీరాభిమాని రామగిరి మండలం నాగేపల్లి గ్రామానికి చెందిన దిలీప్ ఆవేదన వ్యక్తం చేశారు.
మంథని :- నేతిధాత్రి
మంథనిటౌన్ కేంద్రంలో బుధవారం రోజున దిలీప్ కాంగ్రెస్పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరగా ఆయనకు బీఆర్ఎస్పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వనించారు.ఈ సందర్బంగా దిలీప్ మాట్లాడుతూ కన్న తల్లిదండ్రుల కంటే ఎక్కువగా శ్రీధర్బాబును అభిమానించానని, శ్రీధర్ బాబు ఫోటోను టాటూగా గుండెలపై వేయించుకున్నానని అన్నారు. ఎవరూ ఇంత అభిమానం చూపరని, తనలాంటి వీరాభిమానికే గుర్తింపు ఇవ్వకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాలన్నారు. మాజీ ఎమ్మెల్యే, జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ ప్రతి కార్యకర్తను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాడని గుర్తించిన తాను ఆయన నాయకత్వంలో పని చేయాలని కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరానన్నారు.