శ్రీ సిద్దేశ్వర స్వామి వారి ఆలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించిన జహిరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎ సాయి చరణ్
జహీరాబాద్. నేటి ధాత్రి:
జహిరాబాద్ పట్టణం: మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా జహిరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎ సాయి చరణ్ గారు పట్టణంలోని శ్రీ సిద్దేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా శివలింగానికి అభిషేకం నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు, పూజారులు స్వాగతం పలికి, తీర్థప్రసాదాలను అందించి సన్మానించారు.ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ భక్తి శ్రద్ధలతో , ఉపవాస దీక్షలు అభిషేకాలు వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు మనసుకు ప్రశాంతతను కలిగిస్తాయని అన్నారు. నియోజకవర్గ ప్రజలంతా శివరాత్రి పండుగను ఘనంగా జరుపుకోవాలని ఆ మహా శివుని కృపా కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కండెం నర్సింహులు, ఎయంసి డైరెక్టర్ శేఖర్, రాజు, తదితర నాయకులు పాల్గొన్నారు.