Special Focus on Sanitation in Rampur
పారిశుధ్యం పై ప్రత్యేక దృష్టి
నిజాంపేట: నేటి ధాత్రి
గ్రామంలో పారిశుధ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు గ్రామ సర్పంచ్ పొన్నబోయిన ప్రవీణ్ తెలిపారు. నిజాంపేట మండలం రాంపూర్ గ్రామంలో గురువారం పారిశుద్ధ్య కార్మికులు మురికి కాలువలో గల మురికిని తీసేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధులు నేపథ్యంలో.. వ్యాధులు ప్రభలకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. రాత్రిపూట దోమలకు పొగ వెయ్యడం జరుగుతుందన్నారు.
