జైపూర్ మండల కేంద్రంలో పర్యటించిన స్పెషల్ కమిషనర్ సైఫ్ ఉల్లా ఖాన్

జైపూర్,నేటి ధ్రాత్రి:

మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలో గురువారం రోజున స్పెషల్ కమిషనర్ సైఫ్ ఉల్లాఖాన్ ఆర్ డి (ఐఎఫ్ఎస్) ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన జైపూర్ మండల కేంద్రంలోని సేనిగ్రేషన్ షెడ్లను పరిశీలించి పాటించవలసిన తగు సూచనలను తెలియజేసి తగు జాగ్రత్తలు తీసుకుంటూ సేంద్రియ ఎరువు పద్ధతిని కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. తడి చెత్త పొడి చెత్త మరియు ప్లాస్టిక్ వ్యర్ధాలను వేరువేరుగా శుద్ధి చేసి గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. అధికారులు ఎల్లవేళలా ఈ కార్యక్రమాలన్నింటినీ పర్యవేక్షిస్తూ పనులు జరిగేలా చూడాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డి ఆర్ డి ఓ, డిపిఓ, ఎంపీడీవో, ఈసీ, టెక్నికల్ అసిస్టెంట్, పంచాయతీ సెక్రెటరీ పలువురు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!