కృత్రిమ మేధస్సు పై ప్రత్యేక తరగతులు.!

Special classes Special classes

కృత్రిమ మేధస్సు పై ప్రత్యేక తరగతులు

భవిష్యత్తు కృత్రిమ మేధస్సు పై ఆధారపడి ఉంటుంది…. ఎం ఈ ఓ

కేసముద్రం/ మహబూబాబాద్: నేటి ధాత్రి

కృత్రిమ మేధస్సు( ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్) ఏ ఐ పైలెట్ ప్రాజెక్టు కింద కే సముద్రం మండలంలోని ఇంటికన్నె ప్రాథమిక పాఠశాలను ఎంపిక చేయడం జరిగింది. కృత్రిమ మేధస్సుపై పాఠాలు బోధించే ల్యాబ్ ను ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా మండల విద్యాశాఖ అధికారి కాలేరు యాదగిరి పాల్గొన్నారు. అనంతరం ఎంఈఓ మాట్లాడుతూ 3 వ తరగతి నుండి 5వ తరగతి విద్యార్థులు పాఠ్య- సహా పాఠ్య అంశాలతో పాటు కృత్రిమ మేధస్సు పై పరిజ్ఞానం ఉండుటకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఈ సదవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఎంఈఓ సూచించారు. రానున్న కాలంలో భవిష్యత్తు అంతా కృత్రిమ మేధస్సు పై ఆధారపడి ఉంటుందని అన్నారు. రోబోలు వార్తలు చదవడం ఇంటి పనులు చక్కదిద్దడం లాంటి కీలకమైన పనులన్నీ కూడా మనుషులతో సంబంధం లేకుండా యంత్రాలతోటే నిర్వహించడం జరుగుతుందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప్పరపల్లి స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ఎడ్ల సంపత్ రెడ్డి, ఇంటికన్నె ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు టి, శారదాబాయి, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు టి, హోమ్ జి, ఇంటికన్నె గ్రామ కార్యదర్శి సరితా రెడ్డి, మరియు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు విద్యార్థులు అలాగే యువజనులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!