
Sound System Donated to Rampuram School...
9000 రూ తో సౌండ్ సిస్టం బహుకరణ
మరిపెడ నేటిధాత్రి
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో ని రాంపురం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు గుర్రం వెంకన్న గౌడ్ తాను పనిచేస్తున్న పాఠశాల పిల్లల కోసం వారి యొక్క నేస్తం మిత్రులు, వాకర్స్ మిత్రులు ఇంకా కొంతమంది బాల్య మిత్రుల నుండి సేకరించిన రూపాయలు 9000 రూలతో ఆహుజ కంపెనీ సౌండ్ సిస్టంను స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని రాంపురం హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు శశిదర్ చేతుల మీదుగా పాఠశాలకు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు, తోటి ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేశారు, ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం కనకం గణేష్, శ్రీధర్, కిన్నెర శ్రీనివాస్, విద్యార్థుల తల్లిదండ్రులు బందు పరశురాములు తదితరులు పాల్గొన్నారు.