తల్లి చితి ఆరకముందే కుమారుడు గుండెపోటుతో మృతి.

తల్లి చితి ఆరకముందే కుమారుడు గుండెపోటుతో మృతి

మరిపెడ:నేటిధాత్రి.

మండలంలోని ఎల్లంపేట గ్రామంలో కొన్ని రోజులుగా తల్లి గుడిసె భారతమ్మ అనారోగ్యం తో గురువారం ఉదయం మృతి చెందింది.బంధువులందరూ వచ్చారు ఆమె అంత్యక్రియలకు అన్ని సిద్ధం చేసి సాయంత్రం ఆమె దహన సంస్కారాలు పూర్తియైనతరువాత ఇంటికి వస్తున్నా క్రమంలో కొడుకు గుడిసె శీను (45)గుండెపోటుతో బంధువులు, గ్రామస్తులు, సన్నిహితులు అందరూ చూస్తుండగా కుప్పకూలి పడిపోవడంతో ఖమ్మం ఆసుపత్రికి తీసుకెళ్లే క్రమంలో అతను మరణించాడని తెలిసి కన్నీటి పార్వంతామయ్యరు .తల్లి చితి అరక ముందే కొడుకు మరణించడం తో ఎల్లంపేట గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అతనికి భార్య ఒక కూతురు, కుమారుడు ఉన్నారని అతను సుతారి మేస్త్రి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడని ఇప్పుడు ఆ కుటుంబం పెద్ద దిక్కు కోల్పోయిందనిఆ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version