విద్యుత్ సమస్యను పరిష్కరించండి.

కల్వకుర్తి / నేటి ధాత్రి.

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలంలోని యంగంపల్లి గ్రామంలో విద్యుత్ సదుపాయం సరిగ్గా ఉండడం లేదని గ్రామస్తులు తెలిపారు. గ్రామానికి చెందిన రైతులు పొలాలకు ఒకే లైన్ ఉండటం వల్ల బ్రేక్ పదే పదే బ్రేక్ డౌన్ జరుగుతుందన్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ.. శనివారం కల్వకుర్తి విద్యుత్ శాఖ అధికారులకు వినతి పత్రం అందజేశారు. అధికారులు ఈ సమస్యను అతి త్వరలో యంగంపల్లి గ్రామానికి సపరేట్ లైన్ వేసి సమస్య మళ్లీ రాకుండా చూస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రంలో గ్రామస్తులు విజయ్ కుమార్ రెడ్డి జహంగీర్, రామస్వామి, కొండ రెడ్డి, తలసాని శ్రీనివాస్ రెడ్డి, కిషోర్ రెడ్డి, పర్వత్ రెడ్డి, కిరణ్ కుమార్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!