సార్ నా పోస్టుమార్టం ఆపండి పోలీసులకు షాక్ ఇచ్చిన యువకుడు…
Youth Shocks Police: పోస్టుమార్టం జరగడానికి కొన్ని గంటల ముందు ఓ వ్యక్తి ఘాతమ్పూర్ పోలీస్ స్టేషన్కు వచ్చాడు.
సార్ నా పేరు అజయ్ శంక్వర్ నేను బతికే ఉన్నాను.
దయచేసి నా పోస్టుమార్టం ఆపండి అని అన్నాడు.ఉత్తర ప్రదేశ్లోని కాన్పూర్ దేహత్ జిల్లా ఘాతమ్పూర్ టౌన్లో గురువారం ఓ శవం దొరికింది. ఆ శవం ఎవరిది అన్నది తెలియలేదు.
దీంతో పోలీసులు శవం ఫొటో తీసి, వాట్సాప్ గ్రూపుల్లో సర్క్యులేట్ చేశారు.ఆ శవం ఎవరిదో తెలిస్తేచెప్పమని కోరారు.
సుమన్ అనే మహిళ ఘాతమ్పూర్ పోలీస్ స్టేషన్కు వచ్చింది.
చనిపోయిన వ్యక్తి తన తమ్ముడు అజయ్ అని గుర్తుపట్టింది.
అతడు తరచుగా రెడ్ షర్ట్, బ్లాక్ కలర్ పాయింట్ వేసుకుంటాడని కూడా పోలీసులకు చెప్పింది.శవం ఎవరిదో తెలిసింది కాబట్టి.. పోలీసులు మిగిలిన ప్రొసిజర్స్ పూర్తి చేశారు.
శవాన్ని పోస్టుమార్టం కోసం పంపారు. శుక్రవారం ఉదయం పోస్టుమార్టం జరగాల్సి ఉంది. పోస్టుమార్టం జరగడానికి కొన్ని గంటల ముందు ఓ వ్యక్తి ఘాతమ్పూర్ పోలీస్ స్టేషన్కు వచ్చాడు.
‘సార్ నా పేరు అజయ్ శంక్వర్. నేను బతికే ఉన్నాను. దయచేసి నా పోస్టుమార్టం ఆపండి’ అని అన్నాడు. దీంతో పోలీసులు షాక్ అయ్యారు.
చనిపోయాడనుకున్న వ్యక్తి బతికి రావటంతో నోరెళ్ల బెట్టారు. అతడ్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నారు.