Student Felicitates Retired Teacher
గురువును సన్మానించిన సీపతి రాజు
పరకాల,నేటిధాత్రి
పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్ ఉపాధ్యాయుడిగా పనిచేసిన పావుశెట్టి నరసింహా రాములు పదవీవిరమణ పొందిన సందర్భంగా ఆయన శిష్యుడు సీపతి రాజు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించాడు.ఈ సందర్భంగా నరసింహా రాములు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగ పుస్తకాన్ని శిష్యుడికి బహుమతిగా అందించారు.నరసింహా రాములు మాట్లాడుతూ,ప్రతి ఉద్యోగికి పదవీవిరమణ సహజమని,సమాజ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే ఉందని అన్నారు.విద్యార్థులు చదువుతో పాటు విలువలు, సంస్కారంనేర్చుకుని,కష్టపడకుండా ఇష్టపడి చదివి మంచి స్థాయికి ఎదగాలని,అలాగే క్రీడల్లోనూ రాణించాలని కోరారు.
