కార్మికుల సొంతింటి కలను నెరవేర్చే దిశగా చర్చలు..
గుర్తింపు సంఘంగా ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం
ఏఐటీయూసీ జనరల్ సెక్రెటరీ కొరిమి రాజ్ కుమార్
భూపాలపల్లి నేటిధాత్రి
2035 వరకు పాత గనులు మూతపడే అవకాశం ఉందని సింగరేణిలో నూతన గనులు రాకుంటే మను గడ ప్రశ్నార్ధకమని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఎఐటియుసి ప్రధాన కార్యదర్శి కొరిమి కొరిమి రాజ్ అన్నారు. గురువారం భూపాలపల్లి ఏరియాలోని కేటీకే5,ఇంక్లైన్ గని ఆవరణలో
ఏఐటీయూసీ గని ఫిట్ సెక్రెటరీ దోర్నాల తిరుపతి అధ్యక్షతన గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ గేట్ మీటింగ్ కు ముఖ్య అతిథిగా ఏఐటీయూసీ జనరల్ సెక్రెటరీ కొరిమి రాజ్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ.. సింగరేణిలో ప్రస్తుతం ఉన్న పాత బావులు 2035 వరకు పనిచేస్తాయని ఆ తర్వాత నూతన గనులు రావలసిన అవసరం ఉందన్నారు. ఈ విషయంపై యాజమాన్యంతో చర్చించి నూతన గనుల ఏర్పాటుకు కోరడం జరిగిందన్నారు. కార్మికులకు మా సంఘంఇచ్చిన హామీలను యాజమాన్యంతో స్ట్రక్చర్ మీటింగ్లలో మాట్లాడి ఇచ్చిన ప్రతి హామీని పరిష్కరిస్తామని అన్నారు. అదేవిధంగా సింగరేణి కార్మికులకు సొంత ఇంటి పథకం అమలు కోసం ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క దృష్టికి తీసుకు వెళ్ళమని, కార్మికుల సొంత ఇంటి చిరకాల కోరిక నెరవేరుస్తామని అన్నారు.
అదేవిధంగా సింగరేణి కార్మికులకు ఇన్కమ్ టాక్స్ విషయంలో కోలిండియాలో 9వ వెజ్ బోర్డు చార్చలలో ఒప్పందాలు జరిగాయని కోల్ ఇండియాలో ఇప్పటికే కంపెనీ పేర్స్కులర్ పై న ఇన్కమ్ టాక్స్ కంపెనీ రాయితి కల్పిస్తుందని, సింగరేణి కార్మికులకు కూడా మన కంపెనీ ఇన్కమ్ టాక్స్ పైన రాయితి కల్పించాలని యాజమాన్యాన్ని కోరడం జరిగిందన్నారు. కార్మికులు ఎదుర్కొంటున్న మారుపేర్ల విషయంలో స్ట్రక్చర్ మీటింగ్ లో మాట్లాడి ఆ సమస్య పరిష్కరిస్తామని ఈ సందర్భంగా రాజ్ కుమార్ తెలిపారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కార దిశలో మా ఏఐటీయూసీ కార్మిక సంఘం ముందు ఉంటదని కార్మికులంతా ఏఐటీయూసీని ఆదరించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ మాతంగి రామచందర్, ఎండి ఆసిఫ్ పాష, రవికుమార్, వి మల్లికార్జున్, యు కుమారస్వామి, ఎన్ నాగేంద్రబాబు,
వి రాజేందర్, జి తిరుపతి, పి నారాయణమూర్తి, వి ఆంజనేయులు, నాయక్, ఐ ప్రకాష్, కే తిరుపతిరెడ్డి, భీమ,చుక్కన్న, బి రాయమల్లు, జె.రాజు, పి సమ్మిరెడ్డి, టి రమేష్, బి శ్రీనివాస్, ఎం ప్రవీణ్, సిసిందర్, వి రాజు, చందు, రామచందర్, కృష్ణ, కత్తెరసాల తదితరులు పాల్గొన్నారు.