సింగరేణి మండల కేంద్రము సిపిఐ పార్టీ ఘనంగా మేడే నిర్వహన.
ప్రపంచ కార్మికులారా ఏకంకండి 139 వ మేడే పిలుపు.
కారేపల్లి నేటి ధాత్రి.
భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో 139 వ మే డే సందర్భంగా సింగరేణి మండల కేంద్రంలో పలు గ్రామాలలో ఘనంగా మేడే జెండాలను ఎగురవేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ సినియర్ మండల నాయకులు తాతా వేంకటేశ్వర్లు మాట్లాడుతూ 18 86 లో అమెరికా దేశంలోని చికాగో నగరంలో వేలాదిమంది కార్మికులు 8 గంటల పని దినాలు ఉద్యోగ భద్రతకై పెట్టుబడిదారీ వర్గం మీద తిరుగుబాటు చేసి ఆరుగురు కార్మికులు అమరత్వం పొంది ఏడుగురు ఉరిశిక్షలకు గురి అయ్యి ఫాసిస్టు పోలీస్ ప్రభుత్వం జరిపిన కాల్పుల్లో వేలాదిమంది గాయాలపాలై చరిత్రకెక్కిన సందర్భంగా అంతర్జాతీయ శ్రామిక వర్గ దినోత్సవం గా మేడేను ప్రకటించింది నాటి అమరత్వం పోరాటాల సందర్భంగా భారత కార్మిక వర్గం 8 గంటల పరిధినాలను ఉద్యోగ భద్రతను హక్కులను చట్టాలను కార్మిక వర్గం పొందినది ఎన్నో త్యాగాలతో సాధించుకున్న వివిధ కార్మిక రైతాంగ చట్టాలను మతోన్మాద బిజెపి మోడీ ప్రభుత్వం 44 కోడులుగా ఉన్న కార్మిక చట్టాలను నాలుగు కోడులుగా మార్చి 8 గంటల పని దినాలను మార్చి 12 గంటల పని దినాల అమలుకు పూనుకున్నది దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ పరిశ్రమలను ప్రైవేటు వ్యక్తులకు సంస్థలకు బహుళజాతి కంపెనీలకు భూములతో సహా ఆదాని అంబానీలకు తాకట్టు పెట్టింది నిరుద్యోగాన్ని పేదరికాన్ని పెంచి పోషిస్తుందని కనీస వేతన చట్టాన్ని కూడా అమలు చేయడం లేదు గతంలో సాధించుకున్న వన్ ఆఫ్ సెవెంటీ వీసా 2006 అటవీ హక్కుల చట్టాలను అమలు చేయకపోగా 2022 నూతన అటవీ సంరక్షణ నియమావళి చట్టాన్ని తీసుకువచ్చి పై వాటి రద్దుకు పూనుకుంది ఢిల్లీ రైతాంగానికి ఇచ్చిన హామీలను మూడు నల్ల చట్టాలను నాలుగు లేబర్ కోడలు రద్దు చేస్తానని ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా తిరిగి వాటి అమలుకు పూనుకున్నది దేశంలో రాష్ట్రంలో మతోన్మాదాన్ని పెంచి పోషిస్తూ కవులు కళాకారులు అభ్యుదయవాదులపై ముస్లిం మైనార్టీ క్రిస్టియన్ పై దాడులకు హత్యలకు పూనుకొని ప్రశ్నించే గొంతులను నొక్కువేస్తుంది ఆపరేషన్ కగార్ పేరుతో మద్య భారతదేశంలో ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దు కర్రెగుట్ట ప్రాంతంలో 20 లక్షల లక్షల పోలీస్ బలగాలను దింపి వందలాదిమంది అమాయక ఆదివాసి గిరిజన పేద ప్రజలపై గ్రామాలపై దాడులు హత్యాకాండను నిర్బంధాలను కొనసాగిస్తున్నది నక్సలిజం 2006 వరకు నిర్మూలన పేరుతో అమిత్ షా మోడీ 500 మంది అమాయకులను ఆదివాసులను బలి తీసుకున్నది ఎన్కౌంటర్లను కొనసాగిస్తున్న వీటన్నిటికీ వ్యతిరేకంగా అన్ని వర్గాల ప్రజలు ఈ చర్యలను ఖండించి ఐక్యమై సాధించుకున్న హక్కులకై మేడే స్ఫూర్తితో ముందు బాగాన నిలబడి పోరాటాలలో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ మండల సినియర్ నాయకులు తాతా వేంకటేశ్వర్లు ఉంగరాల సుధాకర్ పాటి అనంత రామయ్య పుచ్చకాయల శ్రీను మాంగు హర్సింగ్ నాగళ్ళ చంద్రం లచ్చయ్య తనకేం విజయ్ తనకేం చందర్ రావు తదితరులు పాల్గొన్నారు.