32 ఏళ్లుగా సేవలు.

Serving Serving

32 ఏళ్లుగా సేవలు..

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

ఓవైపు ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం నిర్వహిస్తూ.. మరోవైపు కద లలేని స్థితిలో ఉన్న కుమారుడిని కం టికి రెప్పలా కాపాడుతోంది ఓ మాతృ మూర్తి. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం కుప్పానగర్కు చెందిన ఈశ్వ రమ్మ, రాములుకు 32 ఏళ్ల క్రితం మనోజ్ కుమార్ జన్మించాడు. పుట్టుకతోనే కదలలేని స్థితిలో ఉన్న కుమారుడికి బాగవుతుం దని నమ్మకంతో పలు ఆస్పత్రులలో సంప్రదించారు. అయినా ప్రయోజనం లేకపోయింది. పుట్టినప్పటి నుంచి నేటి వరకు కుమారుడికి అన్ని విధాలుగా సేవలు చేస్తూ కనుపాపలా చూసుకుంటోంది ఆ తల్లి. స్నానం చేయించడం, తినిపించడం, వంటి అన్నీ తానై సేవలు అం దిస్తున్నారు. ఉపాధ్యాయురాలిగా ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తిస్తూనే కొడుకుకి ఏ లోటు లేకుండా చూసుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!