బడిబాట కార్యక్రమం ప్రారంభం
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య
ప్రధానోపాధ్యాయురాలు శ్రీలత
శాయంపేట నేటిధాత్రి:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బడి బాట కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యా యురాలు శ్రీలత బడిబాట కార్యక్రమం కరపత్రం ఆవిష్క రించి ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా గడపగడపకు వెళ్లి ప్రభుత్వ పాఠశాలల్లో అందుతున్న నాణ్యమైన విద్య గూర్చి తెలియజేశారు.
అనంతరం శాయంపేట కూడలి వద్ద ఉపాధ్యాయులతో కలిసి ప్రధానోపాధ్యాయురాలు ప్రభుత్వ పాఠశాలల బలోపే తం గూర్చి ప్రతిజ్ఞ చేశారు.
ఈ సందర్భంగా ప్రధానో పాధ్యా యురాలు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో ఉన్నత ప్రమాణాలతో విద్యనందిస్తు న్నామని ప్రభుత్వం విద్యార్థు లకు ఉచిత పుస్తకాలు అంది స్తూ భోజన సౌకర్యం కల్పిస్తుం దన్నారు.
ఈ అవకాశాన్ని ప్రతి తల్లిదండ్రులు వారి పిల్లల ఉజ్వల భవిష్యత్తుకై తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో నే చేర్పించాలని విజ్ఞప్తి చేశారు.

అంతకుముందు పాఠశాలలో నిర్వహించిన ఒక కార్యక్రమం లో 2025 ఎస్ ఎస్ సి ఫలితా లు అత్యుత్తమ ప్రతిభ కనబరి చిన అక్షయ,సాయి,ఎండి.
అమ్రీన్ లకుప్రధానోపాధ్యాయు రాలు టి.శ్రీలత ప్రశంసా పత్రా లు అందించి అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యా యులు శేఖర్ బాబు, సుజాత , లక్ష్మీబాయి ,రేణుక ,గీత, కుమారస్వామి, రంజిత్ కుమార్, విజయలక్ష్మి, విద్యార్థులు, తల్లిదండ్రులు, పేరెంట్స్ కమిటీ మెంబర్స్, పాఠశాల సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు.