అవినీతి ఆపరా! లంచాలు మానరా!!

`అన్నమే తింటున్నారా! 

`అది కూడా మింగుతున్నారా!!

`అన్నం కన్నా అదే బాగుందని లొట్టలేసుకొని ?

`నోటి దాక వెళ్లే ముందు ముద్దను చూసుకొనే తింటున్నారా!

`తాగేప్పుడు మంచి నీళ్లే తాగుతున్నారా?

`ప్రైవేటు సైన్యం ఏర్పాటు చేసుకొని చేతికి ఇంకు అంటకుండా జాగ్రత్త పడుతున్నారు!

`లక్షలకు లక్షలు తీసుకుంటూనే దమ్ముంటే పట్టుకోండని కొందరు ఎమ్మార్వోలు సవాలు విసురుతున్నారు

`వార్తలు రాసే మీడియాను అవినీతి పరులే నిందిస్తున్నారు!

`లంచం తీసుకోమని మాత్రం ఎవరూ చెప్పడం లేదు

`అక్రమార్జనకు మీడియా అడ్డుపడుతుందని అక్కసు వెళ్లగక్కుతున్నారు

`లంచం కూడా హక్కు అనుకుంటున్నట్లున్నారా?

`సిగ్గు, శరం, అభిమానం అన్నీ వదిలేశారు

`అన్నం తినే మనిషిని ఎప్పుడో చంపుకున్నారు

`లంచం తీసుకోకుండా వుండలేకపోతున్నారు

`లంచం తీసుకునే వాడికంటే పెండల పురుగు నయం

`సమాజమంతా ఛీఛీ అంటున్నా నిస్సిగ్గుగా లంచాలు తింటున్నారు

`ఓ వైపు ఏసిబి దాడులు జరుగుతున్నా అధికారుల్లో భయం లేదు

`నిత్యం ఎక్కడో అక్కడ దొరుకుతూనే వున్నారు

`ప్రజలను పీడిరచుకు తింటూనే వున్నారు

`దొరికిన వాళ్లే కాదు దొరక్కుండా లంచాలు తింటున్న వాళ్లు చాలా మంది వున్నారు

`అవినీతి ఆరోపణలున్న ప్రతి అధికారి ఇంటి మీద ఏసిబి దాడులు నిర్వహించాలి

`అక్రమాస్థులను వెలికి తీయాలి

`అక్రమాస్థులన్నీ ప్రభుత్వ పరం చేయాలి

`లంచం తీసుకొని దొరికిన వారి ఉద్యోగం వెంటనే పోవాలి

`అప్పటి వరకు సంపాదించిన అక్రమార్జన ప్రభుత్వ పరం కావాలి

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

ఉద్యోగమంటేనే లంచాలకు లైసెన్స్‌ ఇచ్చినట్లు భావిస్తున్నారు కొందరు అధికారులు. ప్రజలు చెల్లించే పన్నులతో జీతాలు వస్తన్నాయన్నది మర్చిపోతున్నారు. కష్టపడి ఉద్యోగం సంపాదించున్నాం..అంటుంటారు. ఆ కష్టం జనంకోసం చేశారా? వాళ్లుకు ఉద్యోగం వచ్చిందే ప్రజల కోసం అన్నట్లు, లంచాలు తీసుకోవడం తమకు హక్కు అన్నట్లు ఉద్యోగులు తయారౌతున్నారు. తెలంగాణలో రోజూ కనీసం నలుగురు,ఐదుగురు ఉద్యోగులు ఏసిబికి పట్టుబడుతున్నారు. నిజం చెప్పాలంటే గతం కన్నా కొత్త ప్రభుత్వంలో ఎప్పుడూ లేని విధంగా ఏసిబి రైడ్స్‌ జరుగుతూనే వున్నాయి. ఉద్యోగులు పట్టుబడుతూనే వున్నారు. అడ్డంగా దొరుకుతున్నారు. వేలకు వేలు, లక్షలకు లక్షలు లంచాలు తీసుకుంటూ రెడ్‌ హాండెడ్‌గా దొరుకుతూనే వున్నారు. అందులో కింది స్దాయి ఉద్యోగుల నుంచి మొదలు పెద్ద స్ధాయి అధికారుల వరకు పట్టుబడుతూనే వున్నారు. అయినా ఎక్కడా లంచాలు ఆగడం లేదు. తీసుకునే వారు ఆపడం లేదు. మాకు లంచం లేకుండా పని చేయమని చెప్పే ఉద్యోగులే పెరుగుతున్నారే తప్ప, లంచం తీసుకోమని ఏ ఒక్క అధికారి చెప్పడం లేదు. ఏ శాఖ కార్యాలయం ముందు మాకు లంచం ఇవొద్దు అని బోర్డు పెట్టడం లేదు. బాజాప్త లంచాలు తీసుకుంటున్నారు. దొరికే వారు దొరుకుతున్నారు. లంచాలు తీసుకుంటున్నా దొరకని వారు మేం దొరలమన్నట్లు ఫోజులు కొడుతున్నారు. పైగా మేం లంచాలు తీసుకుంటున్నప్పుడు పట్టుకోండి చూద్దాం…అని కొంత మంది తహసిల్ధార్‌లు సవాలు విసురుతున్నారు. ఆ మెసెజ్‌లను వాట్సాప్‌ గ్రూపుల్లో వైరల్‌ కూడా చేస్తున్నారు. అసలు లంచాలు తీసుకోవడాన్ని ఆపడమే తప్పన్నట్లు కొంత మంది తహసిల్ధార్‌లు గగ్గోలు పెడుతున్నారు. ప్రజల నుంచి కొంత మంది తహసిల్ధార్‌ల అనుచరులు, ప్రైవేటు సైన్యం బహిరంగంగానే లంచాలుతీసుకుంటున్నారు. అలా తీసుకుంటున్న ఎమ్మార్వోల అనుచరులకు సంబందించిన వీడియోలు అనేకం బైట పడుతూనే వున్నాయి. ఏసిబికి పట్టుబడకుండా ప్రైవేటు సైన్యాలను ఏర్పాటు చేసుకొని మరీ లంచాలు తీసుకుంటున్నారు. అలా లంచాల సొమ్ముతో జీతాలిచ్చి అనుచరులను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇంతకీ చాలా మంది తహసిల్ధార్‌లు ఉద్యోగాలు చేస్తున్నారా? లేక ప్రజల మీద వ్యాపారాలు చేస్తున్నారా? రెవిన్యూ వ్యవస్ధ కిందకు వచ్చే అన్ని శాఖల్లో ఇదేతంతు. ముఖ్యంగా ఎమ్మార్వోలకు ప్రైవేటు సైన్యం ఎందుకు? వాళ్లకు కార్యాలయంలో ఏ పని? దర్జాగా ఎమ్మార్వో కార్యాలయంలోకి ఎందుకు వస్తున్నారు? కార్యాలయంలో ఇతర ఉద్యోగుల కన్నా, ఎమ్మార్వోల ప్రైవేటు సైన్యమే ఎందుకు పెత్తనం చేస్తోంది. ఎమ్మార్వో డ్రైవర్‌ దగ్గర నుంచి ధరణి ఆపరేటర్‌తో సహా,ఇతర ప్రైవేటు వ్యక్తులతో కార్యాలయంలో ఆధిపత్యం. లంచాలు పుచ్చుకునేది వాళ్లే… ఆ సొమ్మును ఎవరి కంట పడకుండా ఎమ్మార్వోకు అందజేసేది వాళ్లే… అలాంటి వారికి ఎమ్మార్వో తన జీతం నుంచి డబ్బులు ఇవ్వరు. ఎమ్మారోలు తీసుకునే లంచాలను వారికి పంచుతారు. అంటే తాను తప్పు చేయడమే కాదు…వారి తప్పు బైటకు రాకుండా ప్రజలను పీడిరచి ప్రైవేటు వ్యక్తులను తహసిల్ధార్‌లు పోషిస్తున్నారు. దొంగలుదొంగలు ఊళ్లు పంచుకుంటారన్న సామెతను నిజం చేస్తున్నారు. మీడియా ఇంత పెరిగినా లంచాలు ఎక్కడా ఆగడం లేదు. ఏసిబి ఇంతగా దాడులు చేస్తున్నా లంచాలు ఆపడం లేదు. అసలు ఉద్యోగుల్లో భయమే లేదు. ఏసిబి పట్టుకున్నంత మాత్రాన ఉద్యోగం పోవడం లేదు. సస్పెండ్‌ అయిన కాలానికి కూడా తిరిగి మళ్లీ జీతం వస్తుంది. ఏసిబికి చిక్కిన లంచావతారులకు కూడా ప్రమోషన్లు వెంటనే వస్తున్నాయి. ఇలా అవినీతి అదికారులే ముందు అందలం ఎక్కుతుంటే ఒకరిని చూసి ఒకరు లంచాలకు మరుగుతున్నారు. కోట్లు సంపాదించి, కోటి ఖర్చు పెట్టి మళ్లీ ఉద్యోగంలో చేరుతున్నారు. ఇలాంటప్పుడు ఇక ఉద్యోగులకు భయం ఎందుకు వుంటుంది. కుటుంబం వీధినపడుతున్నందన్న బాధ ఎందుకుంటుంది? ఎలాగూ సిగ్గూ శరం విడిచేశారు. సమాజం ఏమనుకుంటే నాకేంటి? బంధువులు దగ్గర పరువు పోతే వచ్చే నష్టమేముంది? డబ్బుంటే అందరూ చుట్టాలే అన్నట్లు చట్టం కూడా వారికి చుట్టమైపోతోంది. ఉన్నతాధికారులే బంధువులైపోతున్నారు. లంచాలుతిని ఏసిబికి పట్టుబడినా మళ్లీ పై స్ధాయి అధికారులకు లంచాలిచ్చి మళ్లీ కొలువులో చేరుతున్నారు. కింది నుంచి పై స్ధాయి దాకా లంచం ఒక నిచ్చెనగా మారిపోయింది. అందుకే తప్పు చేసినా ఫరవాలేదు. ప్రజలు పీడిరచి సొమ్ము తిన్నా ఉద్యోగానికి ఏమీ కాదు? ఒక వేళ దొరికితే నాలుగు రోజులు జైలు.. ఆ తర్వాత బెయిలు…మరింత కాలం పోతే మళ్లీ కొలువు…ఇంతకన్నా ఏం జరుగుతుంది. లంచాలు తీసుకున్నారని కొలువు నుంచి పూర్తిగా తొలగిస్తారా? లేక జైలు శిక్ష వేసి ఉరి తీస్తారా? న్యాయ స్దానాన్ని కూడా మోసం చేస్తున్నారు. తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తున్నారు. న్యాయ దేవత కళ్లు కప్పేస్తున్నారు. మళ్లీ కొలువులు తెచ్చుకుంటున్నారు. ఇలాంటి సమాజంలో లంచం ఆపమంటే ఎవరు ఆపుతారు..ఎందుకు ఆగుతారు..? ఇది వ్యవస్ధ లోపాలనే అదికారులు రెచ్చిపోతున్నారు. ఇలా అడ్డదిడ్డంగా లంచాలు తీసుకుంటూ మీడియా లేకుంటే బాగుండు అనుకుంటున్నారు. మీడియా పెరిగిపోవడం వల్ల బాజాప్తా లంచాలు తీసుకునే అవకాశం కుదరడం లేదని కొంత మంది తహసిల్ధార్‌లు మధనపడుతున్నారు. మీడియాను దూషిస్తున్నారు. జర్నలిస్టులనే ఎద్దేవా చేస్తున్నారు. గొట్టాలు పట్టుకొని తమను లంచాలు తీసుకోకుండా అడ్డుకుంటున్నారని మీడియాను కొంత మంది ఎమ్మార్వోలు దుమ్మెత్తి పోస్తున్నారు. మీడియా చిత్ర విచిత్రమైన పేర్లు పెట్టుకొని వస్తుందని లేకి మాటలు మాట్లాడుతున్నారు. ఒక మీడియాకు టైటిల్‌ రావాలంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి వుంటే తప్ప రాదన్న సంగతి కూడా తెలియనంత దౌర్భాగ్యస్ధితిలో కొంత మంది ఎమ్మార్వోలున్నారు. మీడియా అనేది గాలికి పుట్టుకొచ్చేదికాదు. ఎవరికి వారు మీడియా అంటూ రారు. అయినా ప్రతి పౌరుడికి అవినీతిని ప్రశ్నించే హక్కు వుంది. లంచావతారులను పట్టించే స్వేచ్ఛవుంది. తప్పు చేసిన వారిని గుర్తించి చెప్పే అధికారం వుంది. దేశంలో ప్రతి పౌరుడు ఒక జర్నలిస్టే…ఈ మాత్రం పరిజ్ఞానం లేని వాళ్లు కొంత మంది ఎమ్మార్వో కొలువులు చేస్తున్నారు. అక్షరం ముక్క రాని వాళ్లు కూడా జర్నలిస్టులుగా చెలామణి అవుతున్నారని జర్నలిస్టులంటే మింగుడు పడని ఎమ్మార్వోలు అంటున్నారు. ఎంత మంది ఎమ్మార్వోలకు కంపూటర్‌ ఆపరేటింగ్‌ వస్తుంది. అసలు కంపూటర్‌లో ఒక్కపదం కూడా టైపింగ్‌ చేయలేని ఎమ్మార్వోలు ఎంతో మంది వున్నారు. అలాంటి వాళ్లు ఎమ్మార్వోలుగా కొలువులు చేస్తున్నప్పుడు సమాజిక బాధ్యత కల్గిన వ్యక్తులు జర్నలిస్టులు కావడంలో తప్పేముంది? అవినీతి అధికారుల బాగోతాలు బైట పెడితే కొంత మందికి కలిగే నొప్పేమిటి? లంచాలు తీసుకుంటున్న అదికారులు రోజూ నిజంగానే అన్నంతింటున్నారా? లేక అందులో అదేదైనా అద్దుకొని తింటున్నారా? అదే రుచిగా వుందని లంచాలకు మరుగుతున్నారా? ఒక ఉద్యోగికి జీతం అంటే అన్నం లాంటంది. లంచం అనేది అశుద్దం లాంటిది. మేం జీతాలు తీసుకుంటాం…లంచాలు తీసుకుంటామంటే అన్నంతో పాటు అదికూడా తింటున్నట్లే అవుతుంది. ప్రజలంతా ఛీ ఛీ అంటున్నా, చీదరించుకుంటున్నా, కాండ్రిరచి ఉమ్మేస్తున్నా తుడుకుంటున్నారే గాని, లంచం తీసుకోవడం చాల మంది మానడం లేదు. ఎంగిలిని అద్దుకు తినడం ఆపడం లేదు. ఇంతకన్నా కుక్క బతుకు మరొకటి వుంటుందా? ప్రజలు ఎంత తిడుతున్నా మమ్మల్ని కాదని దులుపుకుంటూ, లంచాలు తీసుకుంటున్నారు. అందుకే ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత అవినీతి పరులైన ఉద్యోగులను ఏరివేసే యజ్ఞం మొదలుపెట్టింది. అయినా ఉద్యోగుల్లో ఆ వణుకు కనిపించడం లేదు. బెనుకు లేదు. లంచాలు తీసుకోవద్దన్న సోయి లేదు. అసలు ఉద్యోగాలు పోతాయన్న భయం లేకుండా పోతుండడంతో ఇప్పటి వరకు పట్టుబడని వారికి ఉద్యోగాలు ఇటీవల మళ్లీ ఇవ్వలేదు. అయినా అవినీతి అధికారులు మారడం లేదు. అందుకే ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, రెవిన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డిలు అవినీతి అధికారుల పట్ల కఠినంగా వుంటున్నారు. లంచాలు తీసుకొని అడ్డంగా దొరికిన వారిని కొలువులు ఇవ్వడం లేదు. దాంతో దొరక్కుండా లంచాలు తీసుకుంటున్నారు. పైగా మమ్మల్ని పట్టుకునే అవకాశం ఇవ్వమంటూ సవాలు చేస్తున్నారు. కాని నిజాయితీగా కొలువు చేస్తామని అనడం లేదు. అందుకే లంచావతారి అని తెలిస్తే చాలు వారి సంపాదనలపై దర్యాప్తు చేస్తే తప్ప అవినీతి పరులు దారికి రారు. లేకుంటే వారి ఆగడాలు ఆపరు. లంచాలు తీసుకోకుండా వుండరు. ప్రజలను పీడిరచుకుతినడం మానరు. అద్దుక తినే అలవాటు మానుకోరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!