ఎంఆర్ఓ గారికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరుపున బిసి సబ్ ప్లాన్ వినతిపత్రం
జహీరాబాద్ నేటి ధాత్రి:
తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారీ ఆదేశానుసారం,సంగారెడ్డి జిల్లా యూత్ ప్రెసిడెంట్ కొనిదొడ్డి నరసింహ ఆధ్వర్యంలో జహీరాబాద్ నియోజకవర్గంలో మండల ఆఫీస్ బిసి సబ్ ప్లాన్ వినతిపత్రం ఎంఆర్ఓ గారికి అందజేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి కడమంచి వరప్రసాద్, జహీరాబాద్ మండల అధ్యక్షుడు రాకేష్, మొగుడంపల్లి మండల, అధ్యక్షుడు శ్రీను, మొగుడంపల్లి మండల ప్రధాన కార్యదర్శి లతీఫ్ షాప్, ఔరంగాబాద్ గ్రామ అధ్యక్షుడు దేవప్ప, మొగుడంపల్లి మండల్ సోషల్ మీడియా కన్వీనర్ సుభాష్ తదితరులు పాల్గొన్నారు.
