కుందారం గ్రామంలో స్పోర్ట్స్ కిట్స్ అందజేసిన సర్పంచ్ మరియు ఎంపీటీసీ

జైపూర్ , నేటిదాత్రి:

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని కుందారం గ్రామ పంచాయతీ ఆఫీసు నందు శుక్రవారం రోజున తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్పోర్ట్స్ కిట్స్ యువకులకు పంపిణీ చేయడం జరిగింది.
తెలంగాణ ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో క్రీడా ప్రాంగణాలు గతంలో ఏర్పాటు చేశారు. దానిలో భాగంగా కుందారం గ్రామంలోని యువతకు సర్పంచ్ విజ్జగిరి సమ్మయ్య మరియు ఎంపీటీసీ రాచర్ల సతీష్ ఆధ్వర్యంలో యువతకు పలు రకాల క్రీడా సామాగ్రిని అందజేశారు.
ఈ సందర్భంగా వనపర్తి కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి గ్రామానికి క్రీడా ప్రాంగణం ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలియచేశారు.
ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఖాళీ సమయంలో చెడు మార్గంలో వెళ్లకుండా ఇలాంటి క్రీడలపై ఆసక్తి కలుగజేసే విధంగా తెలంగాణ ప్రభుత్వం చేసిన ఈ కార్యక్రమాన్ని యువకులoదరము అభినందిస్తున్నామని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!