నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేసిన సంయుక్త కిసాన్ మోర్చా

నేన్నల్, నేటి ధాత్రి:

ఎస్ కే ఎం ఎస్ ఆధ్వర్యంలో
మంచిర్యాల జిల్లా నెన్నేల మండల కేంద్రంలో ఫిబ్రవరి 23 న నిరసన వ్యక్తం చేసిన
కొండుబానేష్ మంచిర్యాల,
జిల్లా కార్యదర్శి
ఏ ఐకే ఎం ఎస్,
రత్నం తిరుపతి మంచిర్యాల జిల్లా,
అధ్యక్షులు ఏ ఐకే ఎం ఎస్,
మాట్లాడుతూ పంజాబ్ రైతులపై హర్యానా పోలీసుల ఖండిద్దాం,
ఫిబ్రవరి 20న సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో హర్యానా పంజాబ్ సరిహద్దుల్లో హర్యానాకు చెందిన పోలీసులు ఫాసిస్ట్ అంతగా స్వభావంతో అత్యంత కరకషo గా జరిపిన కాల్పులలో పంజాబ్ రాష్ట్రానికి చెందిన బడిండా జిల్లాలోని బాలన్ గ్రామానికి చెందిన 24 ఏళ్ల యువకుడు శుభకరన్ సింగ్ మరణించాడు.
ఆ రైతు నష్ట పరిహారం ఇవ్వాలి, అలాగే రైతులు న్యాయమైన ఈ డిమాండ్లు ప్రభుత్వం పరిష్కరించాల్సిన బాధ్యత ఉంది.మోడీ ప్రభుత్వ కార్పోరేట్ మతతత్వ విధానాలకు నిదర్శనమని ఢిల్లీ కేంద్రంగా సాగిన రైతాంగ పోరాటం సందర్భంగా మూడు సాగు చట్టాలు ఉపసంహరణకు రైతులు పంటలకు ఎం ఎస్ పి ఇస్తామన్నా నరేంద్ర మోడీ రాతపూర్వకంగా ఇచ్చిన హామీని చేయకపోవడంతో రైతులు ఉద్యమ బాట పట్టారు. ఈ డిమాండ్లను పరిష్కరించకుంటే ఉద్యమాలు తీవ్ర స్థాయిలో చేయవలసి వస్తుంది. ఉద్యమాన్ని ఆపాలనుకోవడం దుర్మార్గమైన ఆలోచన విధానం, శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతులపై కాల్పులు జరపడాన్ని అన్ని వర్గాల దేశ ప్రజలు ఖండించవలసిందిగా
సంయుక్త కిషాన్ మోర్చా
ఎస్ కె ఎం ఎస్ కోరుచున్నారు. ఈ కార్యక్రమంలో రాజేష్, సమ్మయ్య, సాగర్,నరేష్, లింగన్న పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!