
జిల్లా సహాయక కార్యదర్శి ఎర్ర రమేష్ గౌడ్
రామన్నపేట నేటి ధాత్రి యాదాద్రి భువనగిరి జిల్లా
రామన్నపేట మండల కేంద్రంలో గీతా పనివార్ల సంఘం మండల కౌన్సిల్ సమావేశంలో గీతా పని వారిలో సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఎర్ర రమేష్ గౌడ్ మాట్లాడుతూ 50 ఏండ్లు నిండిన గీతపనివారలకు ఫించను వెంటనే మంజూరు చేయాలి గీత కార్మికుడు ప్రమాదవశాత్తు చనిపోతే వారి భార్యలకు ఫించనును వెంటనే పునరిద్దరించాలి గీతపనివారలు తాటిచెట్లు ఎక్కుతూ జీవనోపాధి పొందుతున్నారని, తద్వారా వారి శరీరం, ఎముకలు ధృడత్వాన్ని కోల్పోయి 50 ఏండ్ల లోపే ఎటూ చేతగానీ స్థితికి వెళుతున్నారని వారికి కూడా ఫించను ఇవ్వడానికి ప్రభుత్వం ఎందుకు తాత్సారం చేస్తోందని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు…50 ఏండ్లు నిండిన గీత పనివారు మండలంలో 200 మంది ఉన్నారని, వారికి ఫించను వెంటనే మంజూరు చేయాలని, అదే విధంగా గీతపనివారల కార్మికుడు తాటిచెట్టుపై నుండి పడి , లేదా ప్రమాద వశాత్తు చనిపోతే వారి కుటుంబానికి అండగా ఉండి ఫించనును వెంటనే పునరిద్దరించాల్సిన ప్రభుత్వం ఏవో కారణాలు చూపుతూ ఫించను రాకుండా చేస్తున్నారని, ఈ పరిస్థితి గమనించి ప్రభుత్వం వెంటనే 50 ఏండ్లు నిండిన గీతపనివారలకు,గీతపనివారలు ప్రమాద వశాత్తు చనిపోతే వారి కుటుంబాలకు ఆసరాగా ఉండడం కోసం ఫించన్లను వెంటనే ఇవ్వాలని ఎర్ర రమేష్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండు చేసారు లేని యేడల జిల్లావ్యాప్తంగా గీతపనివారలతో పెద్దఎత్తున ఆందోళన చేస్తామని చెప్పారు ఈ సమావేశంలో గీతపనివారల మండల అధ్యక్షులు గంగాపురం వెంకటయ్య, గీతపనివారల సీనియర్ నాయకులు బాలగోని మల్లయ్య, కొమ్మాయిగూడెం గౌడసంఘం అధ్యక్షులు ఎర్ర వెంకటేశం, గీతపనివారల నాయకులు భూపతి నర్సింహ్మ తదితరులు పాల్గొన్నారు