RTC Retired Employees Demand Pending Dues
ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులకు బకాయిల ను చెల్లించాలి
విశ్రాంత ఉద్యోగుల ఆధ్వర్యంలో డిపో మేనేజర్ కు వినతి
నర్సంపేట,నేటిధాత్రి:
ఆర్టీసీలో ఉద్యోగాలు చేసి రిటైర్డు పొందిన విశ్రాంత ఉద్యోగులకు ప్రభుత్వం నుండి రావాల్సిన బకాయిలను చెల్లించాలని కోరుతూ శనివారం నర్సంపేట ఆర్టీసీ విశ్రాంతి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో డిపో మేనేజర్ ప్రసూన లక్ష్మికి,సెక్యూరిటీ విజిలెన్స్ ప్రతినిధులకు వేరువేరుగా వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్టీసీ విశ్రాంతి ఉద్యోగుల రాష్ట్ర సారధ్య కమిటీ ఆదేశాల మేరకు అన్ని బస్ డిపోల వద్ద సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసుకొని వినతిపత్రాలు అందజేసినట్లు పేర్కొన్నారు. నర్సంపేట డిపో అర్పిఎస్ 2017 ఏరియర్స్, గ్రాజిటీ, లీవ్ ఎన్కాష్మెంట్, డిఫరెన్స్ డబ్బులు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు.పిఎఫ్ పెన్షన్ విషయంలోనీ ఇబ్బందులను తొలగించాలని కోరారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రతినిధి పట్టాభి లక్ష్మయ్య, జిల్లా ప్రతినిధి రవీందర్ డిపో ప్రతినిధులు ఏవై స్వామి, ఎస్ వి చారి, ఏ సాంబయ్య,ఎ.కే స్వామి, దయానంద్, మోహనాచారి, జె. శ్రీనివాస్ రెడ్డి, సాదిక్ పాల్గొన్నారు.
