గుజ్జ గ్రామానికి ఆర్టీసీ బస్సులు పునరుద్ధరించాలి: సిపిఎం
.రీజనల్ మేనేజర్ కు సీపీఐ(ఎం) వినతి
నల్లగొండ జిల్లా, నేటిదాత్రి:
గుజ్జ గ్రామానికి నార్కట్ పల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ను పునరుద్ధరించడంతోపాటు ప్రస్తుతం నడుస్తున్న నల్లగొండ డిపోకు చెందిన బస్సును గ్రామం లోపలికి వెళ్లి తిరిగి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ శుక్రవారం సీపీఐ(ఎం)నాయకులు నల్లగొండ ఆర్టీసీ రీజినల్ మేనేజర్ కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు నారి ఐలయ్య,బండ శ్రీశైలం మాట్లాడుతూ కరోనాకు ముందు నార్కట్పల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఉదయం 6.30 గంటలకు నార్కట్పల్లి నుంచి బయలుదేరి బ్రాహ్మణ వెల్లేముల,పలివెల,గుజ్జ, సర్వేలో గ్రామాల మీదగా చౌటుప్పల్ కు వెళ్లి తిరిగి అదే గ్రామాల మీదగా నార్కట్పల్లికి చేరుకునేది అన్నారు.ఉదయం సాయంత్రం ఇలా రోజుకు రెండు పర్యాయాలు తిరిగేదన్నారు.ప్రస్తుతం నడుస్తున్న నల్లగొండ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు గ్రామం లోపలికి వెళ్లి హైదరాబాదులోని దిల్సు ఖునగర్ వరకు పెళ్లి తిరిగి వచ్చేదన్నారు.కరోనా సమయంలో బంధయిన ఈ బస్సులు తిరిగి నల్లగొండ డిపోకు చెందిన బస్సు ప్రారంభమైనప్పటికీ నార్కట్పల్లి డిపోకు చెందిన బస్సు ప్రారంభం కాలేదన్నారు.వాణిజ్య పంటలకు కేంద్రమైన గుజ్జ గ్రామానికి బస్సు సౌకర్యాలు లేకపోవడం వల్ల పండించిన పంటలను అమ్ముకునేందుకు రైతులు, విద్యాబుద్ధులు నేర్చుకునేందుకు ఇతర ప్రాంతాలకు వెళ్లే విద్యార్థులు,వివిధ అవసరాల కోసం వెళ్లే ప్రజలకు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు అన్నారు. నార్కట్ పల్లి ఆర్టీసీ బస్సులు తిరిగి పునరుద్ధరించాలని, నల్లగొండ నుంచి వస్తున్న బస్సులు గ్రామంలో పలికి రప్పించాలని కోరుతూ శుక్రవారం ఆరంభకు వినతిపత్రం అందజేశారు. వినతి పత్రం అందజేసిన వారిలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు నారీ ఐలయ్య,గుజ్జ గ్రామానికి చెందిన సీపీఐ(ఎం) నల్లగొండ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం, నారాయణపురం మండల కార్యదర్శి దోడ యాదిరెడ్డి, గుజ్జ మాజీ సర్పంచ్ చాడ నరసింహ,ఉప సర్పంచ్ వెలిజాల గోపిక,రైతు సంఘం నాయకులు బొమ్మగాని శంకరయ్య, మహిళా సంఘం నాయకురాలు కుకుడాల మంగమ్మ తదితరులు ఉన్నారు.
గుజ్జ గ్రామానికి ఆర్టీసీ బస్సులు పునరుద్ధరించాలి: సిపిఎం
