పేదల కోసం.. రూ.1 భోజనం ప్రారంభం.

Hospital Hospital

పేదల కోసం.. రూ.1 భోజనం ప్రారంభం

బాలానగర్ /నేటి ధాత్రి

 

 

బాలానగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో డ్రీమ్ 100 ఆధ్వర్యంలో.. శుక్రవారం ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి, సినిమా హీరో, డ్రీమ్ 100 ఫౌండర్ మాలినేని కృష్ణ ఆధ్వర్యంలో రూ.1 భోజన పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నిరుపేదలు ఆసుపత్రికి వచ్చి ఆకలితో బాధపడకుండా.. ఈ పథకాన్ని ప్రారంభించామన్నారు. ‘అన్నదానం మహా దానం’ అన్నారు. కోటి విద్యలు కూటి కోసమే అన్నారు. నిరుపేదలను ఆకలితో బాధపడకుండా ప్రతి ఒక్కరూ అన్నదానం చేయుటకు పూనుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు విజయలక్ష్మి తిరుపతి, హరి సింగ్, గుమ్మల్ల రాజేశ్వర్ రెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, పొట్లపల్లి యాదయ్య, రమేష్, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!