ప్రైవేటు పాఠశాలలో విద్యాహక్కు చట్టాన్ని అమలుచేయాలి.

Education Education

ప్రైవేటు పాఠశాలలో విద్యాహక్కు చట్టాన్ని అమలుచేయాలి

నర్సంపేట ఆర్డీఓ ఉమారాణికి వినతి పత్రం

నర్సంపేట నేటిధాత్రి:

ప్రైవేటు పాఠశాలలో విద్యాహక్కు చట్టాన్ని అమలుచేయాలని ఏఐఎఫ్ డిఎస్ వరంగల్ జిల్లా సహాయ కార్యదర్శి మార్త నాగరాజు అన్నారు. ఈ సందర్భంగా నర్సంపేట ఆర్డీఓ ఉమారాణికి వినతి పత్రం అందజేశారు. అనంతరం నాగరాజు మాట్లాడుతూ నర్సంపేట డివిజన్ పరిధిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఉన్న సమస్యలు పరిష్కరించాలని కోరారు. ప్రైవేటు పాఠశాలల్లో కార్పొరేట్ విద్య పేరుతో అధిక ఫీజులు వసూలు చేస్తూ సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నారన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజులు నియంత్రించి ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించి, పాఠశాలలను బలోపేతం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2009 విద్యా హక్కు చట్టంలో భాగంగా ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం నిరుపేద విద్యార్థులకు ఉచిత విద్యను అమలు చేయాలని అధికారులను కోరారు. జర్నలిస్టు పిల్లలకు ప్రభుత్వ పాఠశాలలో మాదిరిగానే ప్రైవేటు పాఠశాలలో ఉచిత విద్యను అందించాలని,బిజెపి ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన విద్యా విధానాన్ని తక్షణమే ఉపసహరించుకోవాలి అన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలల యజమాన్యాలపై చట్టారీత్యా చర్యలు తీసుకోవాలనిలేనిపక్షంలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు కళ్ళేపెళ్లి రాకేష్, ఏఐఎఫ్డిడబ్ల్యు జిల్లా కమిటీ సభ్యులు మార్త సుధ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!