ట్రాన్స్ ఫార్మర్ షాట్ సర్క్యూట్ తో వరిధాన్యం దగ్ధం.

short circuit short circuit

ట్రాన్స్ ఫార్మర్ షాట్ సర్క్యూట్ తో వరిధాన్యం దగ్ధం..

వంద బస్తాల వరిధాన్యం దగ్ధం..1.5 లక్షల నష్టం.

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన..

ప్రభుత్వం ఆదుకోవాలని రైతు బిక్షపతి విజ్ఞప్తి..

అగ్నిమాపక సిబ్బంది వచ్చేసరికే వరిధాన్యం దగ్ధం

నర్సంపేట నేటిధాత్రి:

విద్యుత్తు ట్రాన్స్ ఫార్మర్ కు షార్ట్ సర్క్యూట్ కావడంతో నోటి కాడికి వచ్చిన వరిధాన్యం దగ్ధమయింది ఈ సంఘటన నర్సంపేట మండలంలోని చంద్రయ్యపల్లి గ్రామ శివారులో శనివారం మధ్యాహ్నం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చంద్రయ్య పల్లి గ్రామానికి చెందిన బాధిత రైతు కుక్కముడి బిక్షపతి తెలిపిన వివరాల ప్రకారం యాసంగి వరి పంటకాలం పూర్తికాగా హార్వెస్టర్ సహాయంతో పంట కోత పూర్తి చేసినట్లు తెలిపారు. మరి ధాన్యాన్ని అమ్మకం కోసం సిద్ధంగా ఉంచగా పొలము సమీపంలో గల వ్యవసాయ ట్రాన్స్ ఫార్మర్ కు ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ అయ్యి పక్కనే ఉన్న గడ్డికి ద్వారా మంటలు వ్యాప్తించి వరిధాన్యం కాళీ దగ్ధమైందని రైతు బిక్షపతి ఆవేదన వ్యక్తం చేశారు.

 short circuit
short circuit

షార్ట్ సర్క్యూట్ కు అద్భుతమైన వరి ధాన్యం సుమారు 100 బస్తాలు ఉంటాయని చెప్పారు. అలాగే గడ్డికట్టలు, వ్యవసాయ పైపులు, కరెంటు వైర్లు కాలి బూడిద అయ్యాయని మొత్తం విలువ 1,50 వేలు ఆస్తినష్టం జరిగిందని రైతు బిక్షపతి వివరించారు. మా వరిధాన్యంతో పాటు మరికొందరు రైతుల గడ్డి అరుధాన్యం కూడా దద్దమయ్యాయని తెలిపారు. ఆరగాలం కష్టపడి పండించిన వరి ధాన్యం ట్రాన్స్ఫార్మర్ తప్పిదం వల్ల షార్ట్ సర్క్యూట్ అయ్యి తనకు నష్టం వాటిల్లిందని కాగా ప్రభుత్వం నష్టపరిహారంగా ఆర్థిక సహాయాన్ని అందించి మా కుటుంబాన్ని ఆదుకోవాలని బాధిత రైతు కుక్కముడి బిక్షపతి ప్రభుత్వాన్ని వేడుకున్నారు.

 short circuit
short circuit

షార్ట్ సర్క్యూట్ అయ్యి అగ్ని ప్రమాదం జరిగిన కొద్దిసేపటికి అగ్నిమాపక కేంద్రం అధికారులకు సమాచారం ఇవ్వగా సుమారు రెండు గంటల ఆలస్యంగా వచ్చారని అయినప్పటికీ పక్కనే ఉన్న చెరువులోని నీటితో గ్రామస్తులు రైతుల సహకారంతో మంటలు అదుపులోకి తెచ్చినట్లు రైతు బిక్షపతి తెలిపారు.ఈ సంఘటన పట్ల స్థానిక పోలీస్ స్టేషన్, వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖ అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నట్లు బిక్షపతి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!