చిట్యాల, నేటి దాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో శనివారం రోజున రోజున అమ్మ ఆదర్శ కమిటీలతో మరియు పాఠశాల హెడ్మాస్టర్ లతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా జడ్పీ సీఈవో విజయలక్ష్మి పాల్గొని మాట్లాడుతూ పాఠశాలలో ఉన్న మౌలిక సదుపాయాలైన డ్రింకింగ్ వాటర్ మరియు స్కూల్ కు సంబంధించిన ఏ పనులైన ఇకనుంచి అమ్మ ఆదర్శ కమిటీలు పర్యవేక్షణలో నిర్వహించాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఎంపీవో ఏపీవో పంచాయతీ కార్యదర్శులు అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్లు ఎంఈఓ పంచాయత్ రాజ్ ఇంజనీర్లు మరియు ఐకెపి సిబ్బంది పాల్గొన్నారు.