నేటిధాత్రి కథనానికి స్పందన

ఎమ్మెల్యే కు,నేటిధాత్రి పత్రికకు కృతజ్ఞతలు తెలిపిన నిరుద్యోగులు

పరకాల నేటిధాత్రి
హన్మకొండ జిల్లా పరకాలలో శిథిలావస్థకు చేరిన శాఖా గ్రంధాలయం ను పునరుద్ధరించలని వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులకు సరైన వసతులు కల్పించాలని లైబ్రరీలో ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు స్థానిక ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో రేవూరి ప్రకాష్ రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు.పరకాల లైబ్రరీ పురాతన భవనంలో కొనసాగుతోందని చాలా ఇరుకుగా ఉన్న భవనం సరైన వెంటిలేషన్ లేక చీకటిగా ఉంటుందని,ఇన్వర్టర్ సౌకర్యం లేదని కంప్యూటర్ లు లేక సమాచార సేకరణ ఇబ్బందిగా ఉందని వెంటనే ఏర్పాటు చేయాలని కోరారు.స్పందించిన పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి నిరుద్యోగుల తరుపున నిలపడి సోమవారం రోజున పిఆర్.ఎఈ లైబ్రరీ వసతులు అంచనా వేయడానికి ముందుకు వచ్చారు. ఇతర వ్యక్తులు మూత్రవిసర్జన చేయకుండా ఖాళీ ప్రదేశము లో గార్డెనింగ్ ఏర్పాటు చెడతామన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కట్కూరి దేవేందర్ రెడ్డి,సూర రాజేందర్,అమరెందర్, తదితరులు పాల్గొన్నారు.స్పందించిన ఎమ్మెల్యే కు నేటిధాత్రి పత్రికకు నిరుద్యోగులు ధన్యవాదలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *