మంచినీటి బోర్ వెల్ తో ఊరట
మందమర్రి నేటి ధాత్రి:
మందమర్రి 24 వ వార్డులో బోర్వెల్ను ప్రారంభించిన యాదవ సంఘం అధ్యక్షుడు బండి సదానందం యాదవ్. మందమర్రి పట్టణంలోని 24వ వార్డులో ఈరోజు యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు బండి సదానంద యాదవ్ నూతన బోర్వెల్ ను ప్రారంభించారు. అనంతరం మంత్రి వివేక్ వెంకటస్వామికి పెద్దపెల్లి ఎంపీ వంశీకృష్ణకు పాలాభిషేకం చేసి ఈ సందర్భంగా బండి సదానంద్ యాదవ్ మాట్లాడుతూ 24వ వార్డు ప్రజలకు త్రాగునీటి కోసం పడుతున్న కష్టాలు చూసి ఎమ్మెల్యే గనుల మంత్రి వివేక్ వెంకట స్వామికి చెప్పగా వెంటనే మందమర్రి మున్సిపల్ కమిషనర్ కు ఇంజనీర్ కు ఫోన్ చేసి బోర్వెల్ వేయించమని ఆదేశించగా.

ఈ వార్డులో బోర్వెల్ వేయడం ఈరోజు ప్రారంభించడం జరిగిందన్నారు. మందమర్రి పట్టణ ప్రజలకు ఎలాంటి కష్టాలు ఎదురైనా నేనున్నానంటూ అండగా ఉన్న చెన్నూరు ఎమ్మెల్యే మంత్రి వివేక్ వెంకట స్వామికి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు