రాజీవ్ యువ వికాసం పథకాన్ని సద్వినియోగ పరుచుకోవాలి.

GRB function hall

రాజీవ్ యువ వికాసం పథకాన్ని సద్వినియోగ పరుచుకోవాలి

నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తోకల శ్రీనివాస్ రెడ్డి

నర్సంపేట/దుగ్గొండి,నేటిధాత్రి:*

 

రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన
రాజీవ్ యువ వికాసం పథకాన్ని అర్హత గల ప్రతీ ఒక్కరూ సద్వినియోగ పరుచుకోవాలని నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తోకల శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు.దుగ్గొండి మండల గిర్నిబావి గ్రామంలో గల జిఆర్బీ ఫంక్షన్ హాల్లో జరిగిన రాజీవ్ యువ వికాస పథకం సమావేశం కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు ఎర్రల్ల బాబు అధ్యక్షతన జరిగింది.

ముఖ్య అతిథిగా నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తోకల శ్రీనివాస్ రెడ్డి హాజరై మాట్లాడారు.

రాజీవ్ యువ వికాసం పథకానికి అర్హులైన నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని,ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ ల కార్పొరేషన్ ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం 6 వేల కోట్లతో ఈ పథకాన్ని తీసుకురావడం హర్షణీయమని వెల్లడించారు.

మండల పార్టీ అధ్యక్షులు ఎర్రల్ల బాబు,మండల యూత్ అధ్యక్షులు కొత్తకొండ రవివర్మ మాట్లాడుతూ దుగ్గొండి మండల యువతీ,యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగపర్చుకోడానికి దరకాస్తులు చేసుకోవాల్సిందిగా శ్రీనివాస్ రెడ్డి కోరారు.

GRB function hall
GRB function hall

ఈ కార్యక్రమంలో నర్సంపేట మార్కెట్ కమిటీ డైరెక్టర్ ధన్జ్యానాయక్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఒలిగే నరసింగరావు ,తాజా మాజీ సర్పంచులు క్లస్టర్ ఇంఛార్జ్ లు ఇంగోలి రాజేశ్వర్ రావు,మండల పార్టీ ప్రధాన కార్యదర్శి ఏడేల్లి శ్రీనివాస్ రెడ్డి ,గోగుల ప్రకాశ్ రెడ్డి,నర్సంపేట బ్లాక్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ బొమ్మినేని భరత్,బ్లాక్ వర్కింగ్ ప్రెసిడెంట్ డ్యాగం శివాజీ,మండల యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుకినే నాగరాజు,గ్రామ పార్టీ అధ్యక్షులు పెండ్లి వెంకటేశ్వర్లు,రొట్టె రమేష్,వివిధ గ్రామ పార్టీ యూత్ అధ్యక్షులు,నాయకులు,కార్యకర్తలు,యువజన నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!