ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు.

Rajiv Gandhi's death anniversary Rajiv Gandhi's death anniversary

ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు.

#దేశానికి రాజీవ్ గాంధీ చేసిన సేవలు మరువలేనివి.

#మండల పార్టీ అధ్యక్షుడు చిట్యాల తిరుపతిరెడ్డి.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

 

 

 

స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షుడు చిట్యాల తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో మండల పార్టీ శ్రేణులు రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు అనంతరం తిరుపతిరెడ్డి మాట్లాడుతూ స్వాతంత్ర భారత యువ ప్రధానిగా బాధ్యతలు నిర్వహించి యువతను రాజకీయాల్లోకి వచ్చేలా వారిలో స్ఫూర్తి నింపిన నేత రాజీవ్ గాంధీ. 18 సంవత్సరాలు నిండిన వారికి ఓటు హక్కు కల్పించడం పంచాయతీరాజ్ నవోదయ విద్యాలయా లాంటి అనేక పథకాలను ఆయన ప్రవేశపెట్టారు. దేశానికి సాంకేతికతను తీసుకొని వచ్చి ప్రపంచంలో టెక్నాలజీ విప్లవంలో భారతను నిలిపి తన సత్తా చాటారు. దేశం కోసం తన ప్రాణాలను అర్పించి దేశ ప్రజల గుండెలో చిరకాలగా నిలిచిన గొప్ప మహోన్నత మహనీయుడు రాజీవ్ గాంధీ అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ వై నాలా అశోక్, ఇస్తారు శేఖర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి చార్ల శివారెడ్డి, నాయకులు ఎర్రబెల్లి రఘుపతిరావు, మాలోత్ చరణ్ సింగ్, పురుషోత్తం సురేష్, ఏడాకుల సంపత్ రెడ్డి, పెంతల కొమ్మురారెడ్డి, మాలోత్ మోహన్, తేజ వత్ సమ్మయ్య నాయక్, మామిళ్ల రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!