ఘనంగా రాజీవ్గాంధీ వర్ధంతి
మరిపెడ మండల యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు జాటోత్ సురేష్ నాయక్
మరిపెడ నేటిధాత్రి:
దేశానికి సాంకేతికతను తీసుకువచ్చింది రాజీవ్ గాంధీనేనని మరిపెడ మండల యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు జాటోత్ సురేష్ నాయక్ అన్నారు. రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా బుధవారం మరిపెడ పట్టణంలోని రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో సాంకేతిక విప్లవానికి నాంది పలికింది రాజీవ్ గాంధీనే అన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల సరసన భారత దేశాన్ని నిలిపిన ఘనత ఆయనదేనని గుర్తుచేశారు. దేశంలో బీదరికాన్ని పారద్రోలి సమసమాజ స్థాపనకు ఆయన చేసిన కృషి ఎప్పటికి మరవలేమని కొనియాడారు.ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ ప్రధాన కార్యదర్శి ఎండి అప్సర్,ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ రవికాంత్,మరిపెడ పట్టణ యువ నాయకుడు బంక ప్రమోద్,యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీతేజావత్ అఖిల్ నాయక్, కార్యకర్తలు
తదితరులు పాల్గొన్నారు.