భక్తులతో నిండిపోయిన రాజన్న ఆలయం

సమ్మక్క జాతర సమీపిస్తుండడంతో పెరిగిన భక్తుల రద్దీ

వేములవాడ నేటిదాత్రి

వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో భక్తుల రద్దీ సోమవారం అనూహ్యంగా పెరిగింది. సమ్మక్క, సారలమ్మ జాతర ఈనెల 21 నుండి 24 వరకు ఉండడంతో, భక్తుల తాకిడి ఎక్కువైంది… నూతనంగా వివాహాలు చేసుకున్న జంటలు కోడే మొక్కులు చెల్లించుకొని స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. ఉదయం నుండే తలనీలాలు సమర్పించిన భక్తులు, ధర్మగుండంలో పుణ్యస్నానాలు ఆచరించి, రాజన్న ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలను సైతం భక్తులు దర్శించుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!