పాలమూరు యూనివర్సిటీకి నాణ్యమైన విద్యుత్.

electricity electricity

పాలమూరు యూనివర్సిటీకి నాణ్యమైన విద్యుత్ అందిస్తాం.

ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి.

మహబూబ్ నగర్ /నేటి ధాత్రి:

 

మహబూబ్ నగర్ నగరపాలక సంస్థ పరిధిలోని పాలమూరు యూనివర్సిటీకి నాణ్యమైన విద్యుత్ ను నిరంతరం అందిస్తామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పాలమూరు యూనివర్సిటీ ఆవరణలో రూ.286.54 లక్షలతో నిర్మించనున్న 33/11 కెవి విద్యుత్ సబ్ స్టేషన్ కు ఎమ్మెల్యే శనివారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పాలమూరు యూనివర్సిటీ ప్రాంగణంలో , ఇక్కడ చుట్టుప్రక్కల ఎన్నో విద్యాసంస్థలు రానున్నాయని , పాలమూరు యూనివర్సిటీ తో పాటు నూతనంగా రాబోయే విద్యాసంస్థలకు ఎలాంటి అంతరాయం కలగకుండా నిరంతరం విద్యుత్ అందించేందుకు ఇక్కడ సబ్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నామని, రానున్న 6 నుంచి 8 నెలల లోపు ఈ సబ్ స్టేషన్ అందుబాటులోకి రానుందని, ఈ సబ్ స్టేషన్ అందుబాటులోకి వస్తే.. చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు సైతం నాణ్యమైన విద్యుత్ అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, ఎస్ఈ పివి రమేష్, డిఇ లక్ష్మణ్, పాలమూరు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జి.ఎన్ శ్రీనివాస్, పిజి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మధుసూదన్ రెడ్డి, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!