puttinaroju vedukalu, పుట్టినరోజు వేడుకలు

పుట్టినరోజు వేడుకలు

మంచిర్యాల జిల్లా తాండూరు మండలం బోయపల్లిబోర్డు వేణునగర్‌ వద్దగల సేవాజ్యోతి శరణాలయంలో వరంగల్‌ జిల్లా వాస్తవ్యుడు, సగర జాతీయ సగర సేవా, ఉద్యోగుల సంఘం గౌరవ సలహాదారు, నేటిధాత్రి దినపత్రిక అధినేత, ప్రముఖ వ్యాపారవేత్త, సినీ నిర్మాత, ధాత్రి గ్రూప్స్‌ చైర్మన్‌ కట్టా రాఘవేందర్‌ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా కేక్‌ కట్‌ చేసి విద్యార్థులకు పంపిణీ చేశారు. అనంతరం శరణాలయంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సేవాజ్యోతి శరణాలయం వ్యవస్థాపక అధ్యక్షురాలు గజ్జెల్లి శ్రీదేవి మాట్లాడుతూ ప్రతి సంవత్సరంలో ఒకరోజు మీరోజు కావాలని కోరుతున్నామని అన్నారు. అభాగ్యుల సేవకు ఆలయంగా నిరంతరం సేవలు చేస్తున్న సేవా కార్యక్రమాలు ఆదర్శవంతమైన విధంగా జరగాలని, మీ సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని, మీరు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని, సుఖసంతోషాలతో సమాజానికి ఆదర్శంగా జీవించాలని కోరారు. సేవా జ్యోతి శరణాలయం నుండి ఆశీర్వాదం ఎప్పుడూ మీకు, మీ కుటుంబానికి ఉంటుందని అన్నారు. మంచిర్యాల జిల్లా జాతీయ సగర సేవా, ఉద్యోగుల సంఘం సభ్యుడు ఆసం ముత్తయ్య తిర్యాణి ఎఇఓ మాట్లాడుతూ భారతదేశం ఘనత ప్రపంచానికి పరిచయం చేసిన మహత్ముల పుణ్యభూమిలో పుట్టిన సగరుడు సర్వమానవుల సంక్షేమం కోసం పాటుపడటం అనేకరకాల బాధ్యతలను కూడా స్వీకరించి తదనుగుణంగా ముందుకు వెలుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సేవాజ్యోతి సేవా ప్రముఖ్‌ గజ్జెల్లి మల్లేశం, గజ్జెల్లి సత్యకేశవ్‌ జిత్‌, నిర్వాహాకులు కొంకటి స్వప్న, కష్ణ కొంకటి, కుటుంబ రమేష్‌, రాజ్‌కుమార్‌, సర్వమాధవ్‌ జిత్‌, నాగమణి, రాజేశ్వరి, విద్యార్థులు, మానసిక వికలాంగులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *