ప్రజా సమస్యలు ప్రజా ప్రతినిధులు పరిష్కరించాలి
లేనిచో స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసి అభ్యర్థులను పోటీ చేయిస్తాం
వనపర్తి బి సి ల జన బేరి బహిరంగ సభలో రాచాల యుగేందర్ గౌడ్
వనపర్తి నేటిధాత్రి:
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నామినేటెడ్ పదవుల్లో బీసీలకు అన్యాయం జరిగిందని జిల్ల లో అవినీతిపై బీసీల ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని బీసీ పొలిటికల్ జే ఏ సీ రాష్ట్ర చైర్మన్ రాచాల యుగేందర్ గౌడ్ వనపర్తి లో రాజావారి పాలిటెక్నిక్ కళాశాల మైదానం బి సి జన బేరి బహిరంగ సభలో బీ సీ లను ఉద్దేశించి ప్రసంగించారు ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు ప్రజా ప్రతినిధులు స్థానిక ప్రజల సమస్యలు పట్టించుకోకుంటే అధికారపార్టీపై బీసీల మద్దతుతో తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల లో మున్సిపాలిటీ జెడ్పిటిసి సర్పంచ్ ఎన్నికలలో బీ సీ ల అభ్యర్థులను పోటీ చేయిస్తామని రాచాల పేర్కొన్నారు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా బీసీలు భారీ ఎత్తున పాల్గొని బహిరంగ సభను విజయవంతం చేసినందుకు రాచాల కృతజ్ఞతలు తెలిపారు