మృతుడి కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత.

చిట్యాల, నేటి ధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రానికి చెందిన మూసాపురి రమేష్ ప్రమాదవశాత్తు ఇంటిపై ఉన్న 33 కె.వి కరెంట్ లైన్ కు తాకి మరణించిన విషయం తెలుసుకొని రమేష్ పనిచేస్తున్న తన తోటి పాఠశాలఉపాధ్యాయ బృందం పదివేల రూపాయ లుమరియు పాఠశాల మేనేజ్మెంట్ పదివేల రూపాయలు మొత్తం కలిపి 20 వేల రూపాయల ఆర్థిక సాయం రమేష్ భార్య రమాదేవికి అందజేసిన కాకతీయ హై స్కూల్ కరస్పాండెంట్ మహమ్మద్ రాజ్ మహమ్మద్ మరియు పాఠశాల ఉపాధ్యాయ బృందం గుండా రమేష్ శివరాజు సంపత్ కుమార్ జెట్టి పరమేశ్వరి మల్నేడి సునంద చిలుముల తేజస్విని జెట్టి శైలజ మూగల రేణుక రజిత రమ్య మొదలగు వారు పాల్గొని రమేష్ కుటుంబ సభ్యులకు మనోధైర్యం చెప్పి అండగా ఉంటామని తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!