TDP Leaders Protest for 42% BC Reservation
టీఆర్పీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జ్యోతి పండాల్ ఆధ్వర్యంలో నిరసన
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గం, సంగారెడ్డి జిల్లా, తెలంగాణ టీఆర్పీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు ఉమ్మడి మెదక్ జిల్లా ఇంచార్జ్ జ్యోతి పండాల్ ఆధ్వర్యంలో, 42% బీసీలకు రావాల్సిన రిజర్వేషన్ రాకుండా అడ్డుకున్న బీసీల మరియు తెలంగాణ ద్రోహి అయిన మాధవరెడ్డి దిష్టిబొమ్మను తగలబెట్టడం జరిగింది. ఈ సందర్భంగా జ్యోతి పందాలు మాట్లాడుతూ మనకు స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలకు పైబడిన కూడా ఈ కాంగ్రెస్ పార్టీ బీసీలకు అన్యాయం చేస్తూ వచ్చింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూడా కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తుందని జ్యోతి పండాల్ అన్నారు. బీసీల ఓట్ల కోసం రేవంత్ రెడ్డి నామమాత్రంగా జీవో ని రిలీజ్ చేసి మళ్లీ వాళ్ల వర్గానికి సంబంధించిన వ్యక్తి హైకోర్టులో కేసు వేసి బీసీల రిజర్వేషన్ అడ్డుకోవడం చూస్తుంటే కాంగ్రెస్ పార్టీకి గాని రేవంత్ రెడ్డి కి గాని ఎంత చతుర శుద్ధి ఉందో చాలా స్పష్టంగా అర్థమవుతుందని జ్యోతి పండగ వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో ఆదిల్, మెహిన్ పటేల్, మహమ్మద్ ఆసీస్, షోహెద్, మహమ్మద్ ఒకే, ఇక్రమ్, మహమ్మద్ మోసిన్, మహమ్మద్ జాకీర్, మహమ్మద్ ముజ్జు, మహమ్మద్ కుతుబుద్ధిన్, మహమ్మద్ రిజ్వాన్, విజయ లక్ష్మీ, బిస్మిల్లా, అంజమ్మ, స్వీటీ, అంజన్న, కళావతి, రజిత. తదితరులు పాల్గొన్నారు
