జమ్మికుంట ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ప్రభు ను.

President President

జమ్మికుంట ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ప్రభు ను
ఘనంఘ సన్మానించిన
జాతీయ క్రీడాకారులు రఘు
జమ్మికుంట: నేటిధాత్రి

 

 

జమ్మికుంట ప్రెస్ క్లబ్
(డబ్ల్యూ జే ఐ) అధ్యక్షులుగా నూతనంగా ఎంపికైన అంబాల ప్రభాకర్ (ప్రభు) ను శుక్రవారం జమ్మికుంట అభి శ్రీ ఫౌండేషన్ కార్యాలయంలో జాతీయ క్రీడాకారులు, ప్రభుత్వ ఉపాధ్యాయుడు వంతడుగుల రఘు శాలువ కప్పి శుభాకాంక్షలు తెలిపి ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబాల ప్రభాకర్ (ప్రభు) ఆర్టిస్ట్ గా, అంతర్జాతీయ క్రీడాకారులుగా, సామాజిక కార్యకర్తగా, అనేక రంగాలలోని కాకుండా రెండున్నర దశాబ్దాలుగా జర్నలిస్టు గా వివిధ పత్రికలలో, వివిధ టి.వి ఛానళ్ల లో పని చేయడమే కాకుండా జర్నలిస్టు సంఘంలో విశేష సేవలు అందించి ఎంతో మంది గ్రామీణ ప్రాంత జర్నలిస్టుల హక్కుల కోసం పోరాడి సాధించిన ఘనత అని అన్నారు.
భవిష్యత్తు లో జర్నలిస్ట్ సమస్యలపై పోరాడి వాళ్లకు అండగా ఉంటూ గొప్ప స్థాయికి ఎదగాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కలాల ముత్యం రెడ్డి, శనిగరపు రాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!